వెంకీ మామ .. విక్టరీ వెంకటేష్.. నాగ చైతన్య హీరోలుగా కె ఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదల దగ్గర పడుతుంది. మిలటరీ .. పల్లెటూరు లాంటి అంశాల మేళవింపుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఆర్మీ అధికారిగా వెంకటేష్ కనిపిస్తాడని తెలిసింది. అయితే ఈ సినిమా విషయంలో దర్శక నిర్మాతలు అయోమయంలో ఉన్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయింది .. త్వరలోనే విడుదల డేట్ ను ప్రకటించాలని అనుకున్నారట .. కానీ ఓ విషయంలో వాళ్ళు వెనకడుగు వేసినట్టు తెలుస్తోంది.
అదేమిటంటే .. ఈ సినిమాలో ఆర్మీ మేజర్ గా ఉన్న వెంకటేష్ క్లయిమాక్స్ లో చనిపోతాడట? ఈ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వెంకటేష్ సినిమా అంటే .. ఆ రేంజ్ లో ఫన్ ఉంటుంది .. అలాంటిది ఆయనను చివర్లో చంపేస్తే .. సినిమాకు పెద్ద మైనస్ అని అంటున్నారు. వెంకీ పాత్ర చనిపోతే ప్రేక్షకులు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరని అంటున్నారు. నిజమే యాంటీ క్లైమాక్స్ తో వచ్చిన సినిమాల పరిస్థితి ఏమిటన్నది మనం ఇప్పటికే చాలా సినిమాల విషయంలో చూసాం .. మరి ఈ సినిమాలో కూడా అలాగే ఉంటె .. అదే పరిస్థితి రీపీట్ అవుతుంది.
అందుకే క్లైమాక్స్ మార్చేలా ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు బాబీ .. అందుకోసం కొన్ని సీన్స్ మళ్ళీ చిత్రీకరించే ప్రయత్నాల్లో ఉన్నారట. మరి ఈ విషయంలో నిజ నిజాలు ఏమిటన్నది సినిమా విడుదల అయితే తప్ప చెప్పలేం .. చూద్దాం ఏమి జరుగుతుందో. ఇందులో హీరోయిన్స్ గా రాశి ఖన్నా తో పాటు పాయల్ రాజపుత్ నటిస్తుంది.
