సుశాంత్ మృతి కేసు అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. ఈ కేసు విషయంలో ముంబయి పోలీసులు వర్సెస్ పాట్నా పోలీసులు అన్నట్లుగా వాతావరణం కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో బీహార్ ప్రభుత్వం సిఫార్సుతో సుశాంత్ కేసును కేంద్రం సీబీఐకి అప్పగించింది. దీంతో ఈ కేసు మరింత ఆసక్తికరంగా మారింది. మొదట ఈ కేసును ఆత్మహత్యగా పరిగణలోకి తీసుకున్నారు. కాని ఇప్పుడు ఈ కేసులో కీలక నింధితురాలుగా రియా అంటూ అంతా పేర్కొంటున్నారు. దాంతో ఆమె కొన్ని రోజులు అజ్ఞాతంలోకి కూడా వెళ్లింది.
రియా చక్రవర్తి గురించి బీహార్ పోలీసులు మరియు సీబీఐ వారు అనేక విషయాలను తెలుసుకుంటున్నారు. అందులో భాగంగా రియా చక్రవర్తి కాల్ రికార్డ్ను పట్టుకున్నారు. అందులో పలువురు సినీ ప్రముఖులకు ఆమె ఫోన్స్ చేసినట్లుగా గుర్తించారు. ఆ జాబితాలో తెలుగు స్టార్స్ అయిన రానా మరియు రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉండటం చర్చనీయాంశం అయ్యింది. రకుల్ ప్రీత్ సింగ్ కు ఏకంగా 30 సార్లు కాల్ చేయడంతో పాటు ఇద్దరి మద్య ఎస్ఎమ్ఎస్ సంభాషణ కూడా జరిగిందట.
ఇద్దర మంచి స్నేహితులు అవ్వడం వల్ల కాల్స్ చేసుకుని ఉంటారు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుశాంత్ మృతికి ముందు కూడా వీరిద్దరు నెట్టింట ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకోవడం మనం చూశాం. అయితే రానాకు ఈమె ఏడు సార్లు కాల్ చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరిద్దరు కలిసి నటించింది లేదు. ఒకటి రెండు సార్లు కలిసి ఉంటారు. అయితే రానాకు ఈమె ఏడు సార్లు ఎందుకు కాల్ చేసింది అనేది కొందరి ప్రశ్న. ఇండస్ట్రీలో ఇలాంటివి అన్ని కామన్ అంటూ కొందరు దీన్ని చాలా లైట్గా తీసుకుంటున్నారు. మొత్తానికి కాల్ రికార్డ్ లో టాలీవుడ్ స్టార్స్ పేర్లు ఉండటం చర్చనీయాంశం అయ్యింది.
482289 23790The Spirit of the Lord is with them that fear him. 976881
787443 394324I real delighted to find this site on bing, just what I was looking for : D also bookmarked . 824311
213400 556266Fantastic post, I conceive weblog owners ought to acquire a whole lot from this internet weblog its real user pleasant. 691821