తెలంగాణ ఏర్పడి ఏడేళ్లైనా ఉద్యోగాలు భర్తీ చేయడంలేదంటూ ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగి సునీల్ నాయక్ (25) చికిత్స పొందుతూ మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామ సమీపంలోని తేజావత్ సింగ్ తండాకు చెందిన బోడ సునీల్ నాయక్ డిగ్రీ చదివాడు. గత ఐదేళ్లుగా పోలీస్ ఉద్యోగం కోసం సన్నద్ధమవుతున్నాడు. 2016లో జరిగిన పోలీస్ ఉద్యోగ నియామకాల్లో అర్హత సాధించినా.. దేహదారుఢ్య పరీక్షల్లో విఫలమయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం హన్మకొండ నయీంనగర్ లో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటూ.. పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయసు పెంచడంతో తీవ్రంగా నిరాశ చెందాడు. ఇక ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేసే అవకాశం లేదనే మనస్తాపంతో గతనెల 26న కేయూ క్రీడా మైదానంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే పోలీసులు అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్ లో తీసుకురాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు.
782277 175276Aw, this was a genuinely good post. In concept I wish to put in writing like this moreover – taking time and actual effort to make an excellent article nevertheless what can I say I procrastinate alot and not at all appear to get something done. 248762
897948 708137Thanks for yet another informative post. Exactly where else could anyone get that kind of info in such a effortless to recognize way of presentation. 359872