‘మేమే గొప్ప.. మాకు ఎవరూ మద్దతు అవసరం లేదు.. మాకు అసలు తెలంగాణలో మిత్రపక్షమే లేదు..’ అని విర్రవీగుతున్న తెలంగాణ బీజేపీకి, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలు షాకిచ్చాయి. వలస నేతల అత్యుత్సాహం బీజేపీ కొంప ముంచేసింది.
జనసేనానితో పొత్తు లేదంటూ కొందరు వలస నేతలు చేసిన బాధ్యతారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు.. జనసేన పార్టీకి చికాకు తెప్పించాయి. దాంతో మిత్రపక్షం బీజేపీ కి కాకుండా, పీవీ నరసింహారావు కుమార్తె.. అన్న కోణంలో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి సురభి వాణికి మద్దతిచ్చింది జనసేన. ఆ దెబ్బ తాలూకు నొప్పి కాస్త లేటుగా తెలిసొచ్చినట్టుంది.. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక కోసం జనసేన మద్దతు కోరేందుకు తెలంగాణ బీజేపీ నాయకత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా మరికొందరు బీజేపీ ముఖ్య నేతలు పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళనున్నారట. ‘అయ్యిందేదో అయిపోయింది.. ఇకపై కలిసి పనిచేద్దాం..’ అంటూ తెలంగాణ జనసేన ముఖ్య నేతలతో ఇప్పటికే తెలంగాణ బీజేపీ నాయకత్వం సంప్రదింపులు జరిపిందట. అయితే, ప్రతిసారీ ఇలా బతిమాలుకోవడం, అవసరం తీరాక వెటకారం చేయడం బీజేపీకి అలవాటైపోయిందనే ఆవేదన జనసేనలో కనిపిస్తోంది.
బీజేపీ అధిష్టానం స్థాయిలో తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలకు వాస్తవ పరిస్థితులు అర్థమయ్యేలా క్లాస్ ఇప్పించాలన్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన అట. అయితే, నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం కోసం పవన్ కళ్యాణ్ వస్తే బావుంటుందన్న కోణంలో, బీజేపీ అధినాయకత్వం వున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ నాయకుల్ని పవన్ వద్దకు బీజేపీ అధిష్టానమే పంపిస్తోందట.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ పార్టీకి దెబ్బ తగిలి వుంటే, బీజేపీ – జనసేన పార్టీలకు తెలంగాణలో అదో పెద్ద అడ్వాంటేజ్ అయి వుండేది. అద్భుతమైన అవకాశాన్ని తమ అహంకారంతో కాలదన్నేసుకున్న బీజేపీ, ఇప్పుడు పవన్ వద్దకు కాళ్ళ బేరానికి వెళుతుండడాన్ని ఏమనుకోవాలి.?
477660 321378A really quite interesting post! Ill try to track that continues here! Thank you. 695203
659508 174665Hi there! Fantastic stuff, please do tell me when you finally post something like that! 424909