52 రోజుల సమ్మె ఫలించింది అనాలో లేదంటే ఇంకేమైనా అనాలో తెలియదుగాని, మొత్తానికి కార్మికులు సమ్మె విరమించిన రెండు రోజులకు కెసిఆర్ చల్లనిమాట మాట చెప్పాడు. సమ్మె విరమించిన కార్మికులను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లోకి తీసుకుంటున్నట్టు నిన్న సాయంత్రం ప్రకటించారు.
పోనీలే అందుకు సంతోషం అని చెప్పాలి. సమ్మె చేస్తున్న సమయంలో వారిని సెల్ఫ్ డిస్మిస్ అయినట్టుగా ప్రభుత్వం మొదట ప్రకటించింది. ఇలా ప్రకటించడంతో పాపం కార్మికులు షాక్ అయ్యారు. సెల్ఫ్ డిస్మిస్ ఎలా చేస్తారు అని చెప్పి కోర్టుకు వెళ్లి అనేక ఇబ్బందులు పడటం, కోర్టు కూడా ఏమి తేల్చకపోవడం, అక్కడితో ఆగకుండా కెసిఆర్ రాష్ట్రంలో 5100 రూట్లలో ప్రైవేట్ బస్సులకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వేసిన పిటిషన్ కు కోర్టు అనుమతి ఇవ్వడంతో… ఇక ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తున్నారని వార్తలు వచ్చాయి.
ప్రైవేట్ పరం చేస్తే కార్మికుల పరిస్థితి ఇక అంతే వారిని విధుల్లోకి తీసుకోరు. ఏదో కొంత ముట్టజెప్పి వదిలించుకుంటారు అనుకున్నారు. కానీ, అందరికి షాక్ ఇస్తూ కెసిఆర్ కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటన తరువాత రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు పరుగులు తీస్తున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నది.. కార్మికులకు లాభం చేకూర్చే నిర్ణయం తీసుకొని ప్రయాణికులపై రూ. 792 కోట్ల రూపాయల భారం వేశారు. కిలోమీటర్ కు 20 పైసలు చొప్పున చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పాపం ప్రయాణికులు ఇబ్బందుల్లో పడిపోయినట్టు అయ్యింది. దీనిపై ప్రయాణికులు ఎలా స్పందిస్తారో చూడాలి.
261650 656162I saw two other comparable posts although yours was the most beneficial so a great deal 194956