జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తున్న తరుణంలో హైదరాబాద్ ను ముంచిన వరదలు అధికార టీఆర్ఎస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కారణం.. ముంపుకు గురైన ప్రాంతాల్లో స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్లనే కాదు.. ఏకంగా ఎమ్మెల్యేలను, మంత్రులను కూడా ప్రజలు ఏకిపారేస్తున్నారు. స్థానిక సమస్యలు పట్టించుకోకుండా స్వలాభాలు, ఆక్రమణలు, దందాలు చేసి తమను వరదల్లో ముంచారంటూ ప్రజలు వారి ముఖం మీదే కడిగేస్తున్నారు. ప్రజా వ్యతిరేకత పూర్తిగా అర్ధమవడంతో ఎన్నికలను వాయిదా వేయాలని ప్రభుత్వం భావిస్తోందని సమాచారం.
ఉప్పల్ ఎమ్మెల్యే, హయత్ నగర్ కార్పొరేటర్, కూకట్ పల్లి, పటాన్ చెరు, బీఎన్ రెడ్డి నగర్, ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలకు ప్రజల నుంచి ఘోర పరాభవం తప్పలేదు. ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేపై ఏకంగా చెప్పులువిసిరారు. దీంతో ఈ రిపోర్టులన్నీ మంత్రి కేటీఆర్ వద్దకు చేరాయని తెలుస్తోంది. మిగిలిన ప్రాంతాల నుంచి రిపోర్టులు వచ్చాయని ఈ నేపథ్యంలో ప్రజలు శాంతపడ్డ తర్వాతే ఎన్నికలకు వెళ్లడం మంచిదనే అభిప్రాయానికి పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
ఇప్పటికీ వరద ముప్పు తొలగకపోవడంతో ప్రజల వద్దకు వెళ్లాలంటే కార్పొరేటర్ల నుంచి మంత్రుల వరకూ వెనకడుగు వేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో తమకు మళ్లీ టికెట్లు ఇవ్వరేమోనని సిట్టింగ్ కార్పొరేటర్లు భయపడుతున్నారని తెలుస్తొంది. టికెట్ ఇస్తే ప్రజా వ్యతిరేకత తప్పదని కూడా టీఆర్ఎస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు పాలకుల మాటలు వినే పరిస్థితి లేదు. దీంతో వారికి న్యాయం చేసి వారిని శాంతింపజేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం పునరాలోచనలో పడిందంటున్నారు.
669978 785807Ive exactly the same difficulty sometimes, but I usually just force myself via it and revise later. Very good luck! 146857
53689 241431Youre so cool! I dont suppose Ive learn anything like this before. So nice to discover any person with some authentic thoughts on this topic. realy thank you for starting this up. this site is something that is wanted on the internet, someone with a little bit originality. beneficial job for bringing something new to the web! 541517