ఇటీవల కాలంలో కరోనా కారణంగా మరియు ఇతర కారణాలతో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు పలువురు ప్రముఖులు మృతి చెందిన ఈ సమయంలో ఇండస్ట్రీ మొత్తం కూడా ఆవేదనతో ఉంది. ఈ సమయంలో మరో విషాదం చోటు చేసుకుంది. గేయ రచయిత అదృష్ట దీపక్ మృతి చెందారు.
మాదల రంగారావు రూపొందించిన ‘యువతరం‘ సినిమాలో యువతరం కదిలింది పాటతో ఇండస్ట్రీకి పరిచయం అయిన దీపక్ ఆ తర్వాత ఎన్నో విప్లవ సినిమాలకు సాహిత్యం అందించారు. పెద్ద ఎత్తున ఈయన పాటలకు అప్పట్లో అభిమానులు ఉన్నారు. విప్లవ భావజాలం కలిగిన దీపక్ ఆ తరహాలో ఎన్నో పాటలను రాయడం జరిగింది.
924509 603059Numerous thanks for the great post C Id enjoyable reading it! That i love this weblog. 799184