తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరైనా బీజేపీ వైపు వెళుతున్నారా.? లేదా.? అన్నదానిపై కొంత సందిగ్ధత కన్పిస్తోంది. నలుగురు రాజ్యసభ సభ్యులు టీడీపీని వీడి, వైసీపీలోకి వెళ్ళాక.. ఇంకో పది పదిహేను రోజుల్లోనే తెలుగుదేశం పార్టీ ఖాళీ అయిపోనుందని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ, అనూహ్యంగా బీజేపీలోకి వెళ్ళే టీడీపీ నేతల సంఖ్య తగ్గింది.
ఇదిలా వుంటే, వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు, భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారన్న ఊహాగానాలు తెరపైకొస్తున్నాయి. మామూలుగా అయితే, ‘అలా జరిగేందుకు ఛాన్స్ లేదు’ అనే అభిప్రాయమే అంతటా వ్యక్తమవుతుంది.. వైసీపీ ఎంపీలు, బీజేపీలోకి వెళ్ళడం గురించి. కానీ, రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పుడెలా మారతాయో చెప్పలేం.
సదరు ఎంపీలతో బీజేపీ అధిష్టానం టచ్లో వుందన్నది ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి అందుతోన్న లీకుల సారాంశం. ఆ ముగ్గురిలో ఒకరు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన ఎంపీ అట. ఈ మధ్యకాలంలో వైసీపీ నిర్ణయాల పట్ల సదరు ఎంపీగారు అసంతృప్తితో వున్నారట. ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకి ముందు, తర్వాత పరిణామాల నేపథ్యంలో పార్టీ వ్యవహార శైలి పట్ల సదరు ఎంపీగా మీడియా సాక్షిగానే ఆవేదన వ్యక్తం చేశారు.
‘స్పీకర్ స్థానంలో వున్న వ్యక్తి ఫర్నిచర్ని సొంతానికి వాడుకుంటారని నేను నమ్మను.. ఈ విషయంలో పార్టీలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు..’ అంటూ ఓ చర్చా కార్యక్రమంలో సదరు ఎంపీ అభిప్రాయపడ్డారు గతంలోనే. ఇక, మరో ఇద్దరు ఎంపీలు ఎవరన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిన సుజనా చౌదరి, ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారట. డైరెక్ట్గా కేంద్ర హోంమంత్రి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కనుసన్నల్లోనే ఈ మొత్తం ఆపరేషన్ జరుగుతోందన్నది ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ప్రముఖంగా విన్పిస్తోన్న ఊహాగానాల సారాంశం. అయితే, బీజేపీ తరఫున జరుగుతున్న ఈ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో వేచి చూడాల్సిందే.
759239 161700What a lovely weblog. I will surely be back again. Please preserve writing! 808966