బీటెక్ అమ్మాయి రమ్య హత్య సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన విషయం తెల్సిందే. నడి రోడ్డు మీద అమ్మాయిని అత్యంత దారుణంగా చంపిన వ్యక్తిని పోలీసులు వెంటనే పట్టుకున్నారు. సంఘటన జరిగిన ప్రదేశంలో సీసీ టీవీ ఫుటేజ్ ను పరిశీలించగా హత్యకు పాల్పడిన వాడు ఎవడు అనే విషయమై క్లారిటీ వచ్చింది. దాంతో వెంటనే అతడిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.
ఈ హత్య కేసును స్వయంగా డీజీపీ పర్యవేక్షిస్తున్నారు. ఇక సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మృతి రాలి కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ప్రకటించడం జరిగింది. హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా ఆ సమయంలో అతడు బ్లేడ్ తో చేయి చేసుకున్నాడు. అతడిని పోలీసులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతడు కోలుకున్న తర్వాత ఎంక్వౌరీ మొదలు అవుతుందని పోలీసులు పేర్కొన్నారు.
397138 579364magnificent submit, really informative. I ponder why the opposite experts of this sector dont realize this. You should proceed your writing. Im sure, youve a great readers base already! 809450
772571 975972I always was interested in this subject and still am, regards for posting . 685917