Switch to English

జనసేన, టీడీపీ, బీజేపీ.. పొత్తు కుదిరింది.! తర్వాతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఎలాగైతేనేం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనుకున్నది సాధించారు. బీజేపీ – టీడీపీలను కలపగలిగారు.! 2014 ఎన్నికల నాటి పొలిటికల్ ఈక్వేషన్ మళ్ళీ షురూ అయ్యింది. ఆ కూటమిలో సెంటరాఫ్ ఎట్రాక్షన్ అవుతోంది జనసేన పార్టీ.
24 అసెంబ్లీ, 3 లోక్ సభ సీట్లను ఇప్పటికే పొత్తులో సొంతం చేసుకుంది జనసేన పార్టీ. అందులోంచి, బీజేపీకి ఒక ఎంపీ సీటుని జనసేన త్యాగం చేయబోతోందన్న ప్రచారం జరుగుతోంది. అయితే, బీజేపీ కూడా పొత్తులోకి వస్తుందన్న కోణంలోనే ఇరవై నాలుగు అసెంబ్లీ, మూడు లోక్ సభ సీట్లకు జనసేన ఒప్పుకుందన్నది బహిరంగ రహస్యం.

ఇప్పుడిక బీజేపీ కోసం త్యాగం చేయాల్సింది తెలుగుదేశం పార్టీనే. ఆరు ఎంపీ సీట్లను బీజేపీ అడుగుతోందన్న ప్రచారమైతే జరుగుతోంది. పదిహేను వరకు అసెంబ్లీ సీట్లనూ బీజేపీ కోరుతోందట.!

కానీ, ఏపీలో బీజేపీకి వున్న ఓటు బ్యాంకుని పరిగణనలోకి తీసుకుంటే, ఇదంతా దండగ వ్యవహారమే. కానీ, పొత్తు ధర్మంలో భాగంగా బీజేపీ గొంతెమ్మ కోర్కెల్ని చంద్రబాబు కొంతవరకు మన్నించక తప్పదు. ఇక్కడ అవసరం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిదే.

పొత్తు పెట్టుకున్న మూడు పార్టీలు, కింది స్థాయిలో కలిసి పని చేయాలి. ఒక్క సీటును కూటమి కోల్పోయినా, అది వైసీపీకి అప్పనంగా ఇచ్చేసినట్లే అవుతుందన్న విషయాన్ని బీజేపీ అధినాయకత్వంతో జరిపిన చర్చల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కుండబద్దలుగొట్టేశారు.

98 పర్సంట్ స్ట్రైక్ రేట్ అనే మాట ఊరికే జనసేనాని అనలేదు. అన్నీ ఆలోచించే ఆయన ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను’ అనే ప్రకటన చేశారు. ఆ ఆలోచనతోనే టీడీపీ బీజేపీ జనసేన కలిసి పని చేసేలా చేయగలిగారు. ఇప్పుడిక స్ట్రైక్ రేట్ విషయంలోనూ, బీజేపీ అలాగే టీడీపీ.. జనసేనతో కలిసి పని చేయాల్సి వుంది.

ప్రధాని నరేంద్ర మోడీ కొద్ది రోజుల్లోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాబోతున్నారనీ, టీడీపీ – బీజేపీ – జనసేన నిర్వహించబోయే బహిరంగ సభలో పాల్గొంటారనీ తెలుస్తోంది. ఆ సభ వేదికగా మోడీ ఇంకాస్త స్పష్టత ఈ కూటమిపై ఇవ్వాల్సి వుంది. రాష్ట్ర ప్రయోజనాల గురించీ మోడీ స్పష్టత ఇస్తే, 98 శాతం స్ట్రైక్ రేట్ పెద్ద కష్టమేమీ కాదు.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...