పుదుచ్చేరి లో నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్-డీఎంకే సర్కారు కూలిపోవడంతో తదుపరి ఏం జరగనుందనే అంశం చర్చనీయాంశంగా మారింది. సరైన సంఖ్యాబలం లేకపోవడంతో సోమవారం సభలో బలం నిరూపించుకోకుండానే సీఎం నారాయణ స్వామి బటయకు వెళ్లిపోయారు. అనంతరం తన రాజీనామా లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టీ గవర్నర్ తమిళిసైపై పడింది. మరో రెండు నెలల్లోపే అక్కడ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సిన తరుణంలో ఆమె ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా చూస్తున్నారు. అధికార కూటమి కంటే విపక్ష కూటమికే బలం ఎక్కువగా ఉన్నందున ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానిస్తారా లేదా రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తారా లేదా అసెంబ్లీని రద్దు చేస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
ఒకవేళ ప్రతిపక్ష కూటమిని సర్కారు ఏర్పాటుకు ఆహ్వానిస్తే.. ఎన్ఆర్ కాంగ్రెస్ అధినేత రంగస్వామి ముందుకు వస్తారా లేదా అనేదానిపై చర్చ జరుగుతోంది. కేవలం రెండు నెలల కాలానికి ఆయన పగ్గాలు చేపట్టడానికి ముందుకు రాకపోవచ్చని అంటున్నారు. అయితే, అన్నాడీఎంకే-బీజేపీ మాత్రం ప్రభుత్వ ఏర్పాటుకు ఉత్సాహం కనబరుస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నేత నమశ్శివాయం ఈ మేరకు తమ సమ్మతి తెలియజేశారు. అయితే, మరో పది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడదల కావడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో రాష్ట్రపతి పాలనకే గవర్నర్ మొగ్గు చూపే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.
204375 564807I surely didnt comprehend that. Learnt a thing new today! Thanks for that. 279294
46897 845752I believe other site owners ought to take this web site as an model, very clean and fantastic user pleasant pattern . 22031
754554 411685Cheapest speeches and toasts, as nicely as toasts. probably are designed building your own at the party and is going to be most likely to turn into witty, humorous so new even. very best man toast 940305