కోర్కెలు తీర్చమంటూ ప్రతి రోజు దేవుడి ముందు ఎన్నో మొక్కులు మొక్కకుంటాం. తనకు కోరుకున్నది జరిగితే అలా చేస్తా.. అనుకున్నది జరిగితే ఇలా చేస్తా అంటూ దేవుడి వద్ద ఎంతో మంది ఎన్నో రకాలుగా హామీలు ఇస్తారు. కాని తమిళనాడుకు చెందిన ఎస్ నవీన్ అనే వ్యక్తి తాను అనుకున్నది జరిగితే ఏకంగా ప్రాణాలను అర్పిస్తాను అంటూ మొక్కాడు. అన్నట్లుగానే తనకు దేవుడు ఇచ్చిన కోరికకు బదులుగా ఆత్మహత్య చేసుకున్నాడు.
తమిళనాడుకు చెందిన ఆ యువకుడి మృతి ప్రస్తుతం స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది. ఎంతో కాలంగా కష్టపడి చదువుతున్న 33 ఏళ్ల నవీన్ కు ఇటీవల ఒక ప్రముఖ బ్యాంక్ లో అసిస్టెంట్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. మంచి జీతంతో పాటు ముంబయిలో ఉద్యోగం. 15 రోజులు ఉద్యోగం చేసిన తర్వాత నవీన్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వద్ద లభించిన సూసైడ్ నోట్ చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.
కుటుంబంతో పాటు స్నేహితులతో ఉద్యోగం రావడంపై సంతోషంగా చెప్పుకున్న నవీన్ ఇలా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఆయన దేవుడి వద్ద మొక్కిన మొక్కు అంటూ ఆ లేఖలో ఉంది. ఉద్యోగం వస్తే తన ప్రాణాలను బలి ఇస్తానంటూ మొక్కుకున్నాను. అందుకే నేను ఆత్మహత్య చేసుకున్నాను. నా చావుకు ఎవరు బాధ్యులు కాదు అంటూ అతడు పేర్కొన్నాడు. పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నారు.
333066 485775This style is spectacular! You obviously know how to keep a reader amused. Between your wit and your videos, I was almost moved to start my own weblog (properly, almostHaHa!) Wonderful job. I genuinely enjoyed what you had to say, and much more than that, how you presented it. Too cool! 968115
43867 622848This post post produced me feel. I will write something about this on my blog. 29944