అధికారంలో వున్న పార్టీని నిలదీయడమే ప్రతిపక్షం పని. కానీ, అధికార పక్షానికి వేరే పని వుంటుంది. అదే పరిపాలన అందించడం. పరిపాలన సంగతి పక్కన పెట్టి, అధికారంలోకి వచ్చాక కూడా రాజకీమయే చేయాలన్న ‘కక్కుర్తి’ అధికారంలో వున్నవారికి వుంటే ప్రజలకు దిక్కెవరు.? ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదవీ ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు పూర్తవుతోంది. సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవి కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు గనుక, వస్తూనే.. రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు వైఎస్ జగన్. కక్ష సాధింపు చర్యలంటే.. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లడం మాత్రమే.
చంద్రబాబు పాలనలో అన్యాయం, అక్రమాలు జరిగాయంటూ గడచిన ఐదేళ్ళుగా వైఎస్ జగన్ మోహన్రెడ్డి నిందారోపణలు చేస్తూనే వున్నారు. ముఖ్యమంత్రి అయ్యాక కూడా అదే తీరు కన్పిస్తోంది. పార్టీ శ్రేణుల్ని ఉత్సాహ పరచాలంటే.. ఆ మాత్రం ‘యాగీ’ తప్పదేమో. కానీ, చంద్రబాబు పాలనను విమర్శించడం తప్ప, తమకు ఇంకో ‘పని’ ఏమీ లేదన్నట్టు వైఎస్ జగన్ కావొచ్చు, వైసీపీలోని ఇతర ముఖ్య నేతలు కానీ వ్యవహరిస్తే.. ముందు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దయనీయంగా మారుతుంది.
చంద్రబాబు పాలనలో తెరపైకొచ్చిన పథకాల్లో ఇప్పటికే చాలావరకు పథకాల్ని పీకి పారేశారు.. కొన్నిటికి పేర్లు మార్చేశారు. ఈ క్రమంలో, ఆ పథకంలో అవినీతి, ఈ పథకంలో అవినీతి.. అంటూ రోజుకో కొత్త లెక్కని చట్ట సభల్లోనే వైసీపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ప్రెస్ మీట్లలో ఎలాంటి ఆరోపణలు చేసినా ఫర్లేదుగానీ.. చట్ట సభల్లో ఆరోపిస్తే, అందుకు తగ్గ లెక్కలు చూపాలి. లెక్కలు చూపితే సరిపోదు, నిజాలు నిగ్గు తేల్చాలి. చంద్రబాబు హయాంలో అవినీతి జరిగిందని చెబితే సరిపోతుందా.? చర్యలు తీసుకోవాల్సింది ముఖ్యమంత్రి స్థానంలో వున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కదా.!
ప్రజా వేదికని కూల్చేశారు సరే, బాధ్యులపై చర్యలెందుకు తీసుకోలేదన్న ప్రశ్నకు వైసీపీలో ఏ ముఖ్య నేతా సమాధానం చెప్పడంలేదు. ముందుగా అధికారులపైనా, గత పాలకులపైనో చర్యలు తీసుకుని.. ఆ తర్వాత ప్రజా వేదికను కూల్చివేసి వుంటే వైఎస్ జగన్ సర్కార్కి మంచి పేరు వచ్చేదేమో. ఇప్పుడు, తాజాగా జగన్ సర్కార్ కన్ను ‘అన్నా క్యాంటీన్ల’ మీద పడింది. అందులో అక్రమాలు జరిగాయని వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంటే, ‘రాజన్న క్యాంటీన్లు’ తీసుకురావడానికి ముందస్తు ప్లాన్ అన్న మాట. ‘అమ్మ ఒడి’ పథకం గురించిన జరిగిన ప్రచారం వేరు, ఆ తర్వాత అమలులో విధించిన ‘కొర్రీలు’ వేరు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన మహిళల పెన్షన్ విషయమై వైఎస్ జగన్ మాట తప్పేసి, మడమ తిప్పేశారాయె. ఈ అంశాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నం చేయడం తప్ప, చంద్రబాబు పాలనపై విమర్శలు చేసి, ఈ రెండు నెలల్లో వైఎస్ జగన్ సర్కార్ వెలికి తీసిన ‘అవినీతి సొమ్ము’ ఏమన్నా వుందా.?
706043 919397I was curious if you ever thought of changing the page layout of your website? Its very well written; I love what youve got to say. But maybe you could a little more in the way of content so people could connect with it better. Youve got an awful lot of text for only having one or 2 images. Maybe you could space it out better? 572722
434900 161823Thank you for the sensible critique. Me and my neighbor were just preparing to do some research on this. We got a grab a book from our area library but I think I learned far more clear from this post. Im very glad to see such excellent info being shared freely out there. 337054
468967 796395Youre the best, Its posts like this that keep me coming back and checking this web site regularly, thanks for the info! 314776
395106 497084Hi, if you want to get higher rankings, you should have a look at the plugin I left in my link, it will assist. 319808