ఏపీలో హిందూ మతంపై దాడులు కొనసాగుతున్నాయని, హిందు ధర్మంను కాపాడటంలో ప్రభుత్వం విఫలం అవుతుందని హిందు సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వరుసగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇటీవల విజయనగరం జిల్లాలోని ప్రసిద్ద రామ తీర్థంలో దారణం జరిగింది. దేవాలయంలోనే రాముడి విగ్రహంను తల పగుల గొట్టడంతో పాటు గర్బ గుడిని అపవిత్రం చేయడం జరిగిందని హిందువులు ఆరోపిస్తున్నారు.
రామాలయ అర్చకుడు ప్రతి రోజు మాదిరిగానే ఉదయం తాళం తీసేందుకు వెళ్లి చూడగా అక్కడ తాళం పగులకొట్టి ఉంది. వెంటనే గుడి లోనికి వెళ్లి చూడగా సీతా లక్ష్మణ సమేత రాముల వారి విగ్రహం తల పగులకొట్టి ఉంది. దాంతో పూజారి వెంటనే ఈవోకు సమాచారం అందించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేయడం జరిగింది. హిందువులపై జరుగుతున్న దాడులు ఇవి అని హిందూ ధర్మంపై కొందరు యుద్దం చేస్తున్నారు అంటూ హిందూ సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. వెంటనే దోషులను అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు.
295009 967519Read More HERE. I bookmarked it. 66601
762617 236309Thank you a lot for giving every person an extraordinarily particular possiblity to check tips from here. 360978