Switch to English

స్టాలిన్‌తో భేటీ వెనుక సీక్రెట్‌ ఏంటి కేసీఆర్‌.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,431FansLike
57,764FollowersFollow

పొరుగు రాష్ట్రాలతో సన్నిహిత సంబంధాల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రదర్శిస్తున్న ‘చొరవ’ అంతా ఇంతా కాదు. దురదృష్టవశాత్తూ సాటి తెలుగు రాష్ట్రం విషయంలోనే గడచిన ఐదేళ్ళలో కేసీఆర్‌, అస్సలేమాత్రం ‘చొరవ’ చూపించలేకపోయారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గనుక ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి అయితే, అప్పుడు కేసీఆర్‌ ‘చొరవ’ చూపించే అవకాశం లేకపోలేదు. అయితే, ఆ చొరవ అనేది పోలవరం ప్రాజెక్టు అడ్డంకుల్ని తొలగించే విషయంలోనూ, తెలుగు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల వివాదాల్ని తగ్గించే విషయంలోనూ వుంటుందా? ఏమో, మే 23 తర్వాత ఈ అంశాలపై చర్చించుకుంటే మంచిదేమో!

తాజాగా కేసీఆర్‌, తమిళనాడుకి వెళ్ళి అక్కడ ప్రతిపక్షంగా వున్న డీఎంకే పార్టీ చీఫ్‌ స్టాలిన్‌తో మంతనాలు జరిపారు కేసీఆర్‌. ‘రాష్ట్రాల హక్కులు’ అనే అంశంపైనా, జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఆలోచనల గురించీ ఈ సందర్భంగా స్టాలిన్‌తో కేసీఆర్‌ చర్చించారన్నది టీఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్న మాట. అయితే, తెరవెనుక వ్యవహారం వేరేలా వుంది. స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే పార్టీ, కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తోంది. కాంగ్రెస్‌తో కలిసి డీఎంకే, ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెల్సిందే. కాంగ్రెస్‌తో డీఎంకే బంధాన్ని తెగతెంపులు చేసుకునేలా కేసీఆర్‌ తనవంతు ప్రయత్నం చేసొచ్చారు.

ఎలా చూసినా, కేసీఆర్‌ ఫెడరల్‌ ఆలోచనల వెనుక బీజేపీని బలోపేతం చేసే ఉద్దేశ్యమే కన్పిస్తోందని ఇంకోసారి నిరూపితమయ్యింది. కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణిస్తున్న పార్టీని బయటకు లాగాలని ప్రయత్నించడంలో ఇంకో ఉద్దేశ్యాన్ని ఎలా ఆశించగలం? జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓ రాజకీయ శక్తిని తయారు చేస్తామన్నది గులాబీ బాస్‌ పైకి చెబుతున్నమాట. కానీ, దానికి వేరే మార్గాలున్నాయి. ఇంకా దేశంలో తటస్థ పార్టీలు చాలా వున్నాయి. వాటిని వదిలేసి, బీజేపీ వ్యతిరేకుల్ని, పైగా కాంగ్రెస్‌ అనుకూలుర్ని మాత్రమే కేసీఆర్‌ టార్గెట్‌ చేస్తుండడం పలు అనుమానాలకు తావిస్తోంది.

అయితే, కేసీఆర్‌ ఆలోచనల్ని ముందే పసిగట్టిన స్టాలిన్‌ తొలుత ఫెడరల్‌ మంత్రాంగం వైపు ఆసక్తి చూపలేదు. కానీ, తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌, తన ప్రయత్నాలు ఇంకా గట్టిగా చేశారు, స్టాలిన్‌తో భేటీ కోసం. అంటే, స్టాలిన్‌తో భేటీ కేసీఆర్‌కి ఎంత అవసరమో ఈ పరిణామం చెప్పకనే చెబుతోందన్నమాట. ఎలాగైతేనేం, స్టాలిన్‌తో అపాయింట్‌మెంట్‌ కేసీఆర్‌కి దొరికింది. అయితే, భేటీ మాత్రం అంత సంతృప్తికరంగా జరిగినట్లు లేదు. ఒకవేళ భేటీ, కేసీఆర్‌ అనుకున్నట్లు జరిగితే ఆయన మీడియాతో మాట్లాడేవారే.

డీఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం తర్వాత టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, మౌనంగానే బయటకు వెళ్ళిపోయారు.. అదీ మీడియాతో మాట్లాడకుండా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తన ఆలోచనల్ని స్టాలిన్‌తో పంచుకున్నారుగానీ, డీఎంకే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ పార్టీతోనే ముందుకు వెళుతుందని డీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, రాష్ట్రాల హక్కుల విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే కాదు, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలాంటి ప్రతిపాదనలతో వచ్చినా సానుకూలంగా స్పందిస్తామని డీఎంకే అంటోంది.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఎక్కువ చదివినవి

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...