కరోనా దరి చేరకూడదంటే మాస్కు పెట్టుకోవడమే శరణ్యమని ప్రభుత్వాలు ఘోషిస్తున్నాయి. అయితే.. ఒక్క మాస్క్ వల్ల ఉపయోగం లేదని.. రెండు మాస్కులు పెట్టుకుంటేనే వైరస్ శరీరంలోకి ప్రవేశించదని అంటున్నారు శాస్త్రవేత్తలు. యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ కేర్ జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయని అంటున్నారు. జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్ ప్రకారం.. మాస్కుల్లో పొరలు పెరగడం వల్ల ఉపయోగంలేదని అంటున్నారు. ముఖానికి అతుక్కున్నట్టుగా ఉండే మాస్క్ మాత్రమే వైరస్ నుంచి కాపాడుతుందని అంటున్నారు.
సర్జికల్ మాస్క్ పైన వస్త్రంతో చేసిన మాస్క్ పెట్టుకుంటే ఫలితం ఉంటుందని అంటున్నారు. ఇలా చేస్తే వైరస్ ను నిలువరించే సామర్ధ్యం 20 శాతం ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామన్నారు. ఇలా చేయడం వల్ల ముఖం, ముక్కును మాస్క్ గట్టిగా ముఖానికి అతుక్కున్నట్టుగా ఉండి.. వైరస్ నుంచి కాపాడతాయని అంటున్నారు. సర్జికల్ మాస్క్, వస్త్రంతో చేసిన మాస్క్.. చెరి 40 శాతం మాత్రమే కాపాడగలవని నిరూపణైందని అంటున్నారు. వస్త్రంపై సర్జికల్ మాస్క్ పెట్టుకున్నా.. రెండు మామూలు మాస్కులు పెట్టుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదని అంటున్నారు.
465415 264161I gotta favorite this website it seems handy really valuable 855719
644405 104930I like this post, enjoyed this one appreciate it for putting up. 823794