Sandeep Vanga : రణబీర్ కపూర్ తో మన తెలుగు దర్శకుడు సందీప్ వంగ రూపొందించిన యానిమల్ సినిమా ఇటీవలే విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా రూ.900 కోట్ల వసూళ్లు నమోదు చేసిన యానిమల్ సినిమా మేకింగ్ విషయాలను, ఆ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులను గురించి దర్శకుడు సందీప్ వంగ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.
బాలీవుడ్ లో ఉన్న నెపొటిజం గురించి ఆయన ప్రత్యేకంగా చెప్పుకొచ్చాడు. సినిమా కోసం వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా తమ వారే అన్ని చోట్ల ఉండాలి అనుకుంటారు. తమ సొంత వాళ్లకు ప్రాముఖ్యత ఎక్కువ ఇవ్వాలని వారు అంటారు. ఒక వేళ అలా జరగకుంటే అత్యంత క్రూరంగా వారు వ్యవహరిస్తారని సందీప్ అన్నాడు.
గత నాలుగు సంవత్సరాల్లో నాకు ఎదురు అయిన ఆ చేదు అనుభవాలు, సంఘటనలు చెప్పడానికి రెండు రోజుల సమయం కూడా సరిపోదు అంటూ సందీప్ వంగ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం సందీప్ వంగ నెపొటిజం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మరి బాలీవుడ్ వారు సందీప్ వంగ వ్యాఖ్యలకు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.