తెలుగు మీడియా పరిస్థితి ఏమీ బాగోలేదని ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు దానిని బలపరిచే గణాంకాలు బయటకి వచ్చాయి. అనేక కారణాలతో తెలుగు మీడియా.. ముఖ్యంగా ప్రింట్ మీడియా తిరోగమనంలో పయనిస్తోంది. పాఠకుల సంఖ్య తగ్గడంతో యాడ్ రెవెన్యూపై ప్రభావం పడుతుండగా.. న్యూస్ ప్రింట్ కాస్ట్ పెరగడంతో నిర్వహణ వ్యయం భారమవుతోంది. వెరసి తెలుగు పత్రికలు గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాయి. తాజాగా 2019 రెండో క్వార్టర్లో పత్రికల స్థితిగతులు ఎలా ఉన్నాయో వివరిస్తూ ఇండియన్ రీడర్ షిప్ సర్వే (ఐఆర్ఎస్) గణాంకాలు విడుదలయ్యాయి.
మొత్తమ్మీద చూస్తే పత్రికల కంటే డిజిట్ మీడియా వైపు జనం ఆకర్షితులవుతున్నారే విషయం స్పష్టమవుతోంది. ఆన్ లైన్ లో వార్తాపత్రిక చదివేవారి సంఖ్య 2017లో 4.4 శాతం మంది ఉండగా.. 2019 రెండో త్రైమాసికంలో 6.1 శాతానికి పెరిగింది. ఇక ఆన్ లైన్ లో వార్తలు చదివి తెలుసుకునేవారి సంఖ్య 2017లో 4.8 శాతం మంది ఉండగా.. 2019 రెండ త్రైమాసికంలో 9.3 శాతానికి పెరిగింది. మొత్తమ్మీద వార్తాపత్రికల ద్వారా కాకుండా ఆన్ లైన్లో (డిజిటల్ మీడియా, వెబ్ మీడియా, యాప్ బేస్డ్) వార్తలు చదివేవారు 2017లో 7.3 శాతం మంది ఉండగా.. ప్రస్తుతం 13.4 శాతానికి పెరిగింది.
మొత్తమ్మీద ఆన్ లైన్ ద్వారా వార్తలు తెలుసుకునేవారి సంఖ్య 9 శాతం నుంచి 15 శాతానికి పెరగడం విశేషం. ఇక తెలుగు పత్రికల విషయానికొస్తే.. తెలుగు రాష్ట్రాల్లో అగ్రపథంలో కొనసాగుతున్న ఈనాడు తన స్థానాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, పాఠకుల సంఖ్యను మాత్రం దారుణంగా కోల్పోయింది. ప్రాంతీయ పత్రికల్లో దైనిక్ జాగరణ్ తొలి స్థానంలో ఉండగా.. ఈనాడు పదో స్థానంలో ఉంది. 2017లో ఈనాడు టోటల్ రీడర్ షిప్ (టీఆర్) 1.58 కోట్లు ఉండగా.. ప్రస్తుత ఏడాది రెండో త్రైమాసికంలో 1.43 కోట్లకు పడిపోయింది. ఇక ఈనాడు ఏవరేజ్ ఇష్యూ రీడర్ షిప్ (ఏఐఆర్) 2017లో 70.16 లక్షలు ఉండగా.. ప్రస్తుతం 59.73 లక్షలకు పడిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈనాడు పాఠకుల సంఖ్య తగ్గింది.
అయితే, తెలుగు పత్రికల్లో రెండో స్థానంలో ఉన్న సాక్షి పాఠకుల సంఖ్య కాస్త పెరగడం విశేషం. సాక్షి టోటల్ రీడర్ షిప్ 2017లో 91.75 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 86.22 లక్షలకు, రెండో త్రైమాసికంలో 85.98 లక్షలకు తగ్గింది. అయితే, ఈ తగ్గుదల తెలంగాణలో మాత్రమే నమోదు కాగా, ఏపీలో మాత్రం పెరుగుదల కనిపించింది.
2017లో ఏపీలో సాక్షి టోటల్ రీడర్ షిప్ 56.91 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 52.38 లక్షలకు తగ్గింది. రెండో త్రైమాసికానికి వచ్చేసరికి మాత్రం 53.70 లక్షలకు చేరి స్వల్ప పెరుగుదల నమోదు చేసింది. ఇక రెండు రాష్ట్రాల్లో కలిపి సాక్షి ఏవరేజ్ ఇష్యూ రీడర్ షిప్ విషయానికి వచ్చేసరికి 2017లో 32.99 లక్షలు ఉండగా.. 2019 తొలి త్రైమాసికంలో 29.47 లక్షలకు తగ్గి.. రెండో త్రైమాసికంలో 30.86 లక్షలకు పెరిగింది. ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ పత్రికల పాఠకుల్లో కూడా భారీ తరుగుదల నమోదైంది.
586822 657287There is noticeably a good deal to know about this. I believe you produced some good points in functions also. 472148
467250 167410Hi there! Great stuff, please do tell me when you lastly post something like that! 805136
875283 457150You need to take part in a contest for one of the greatest blogs on the internet. I will recommend this web site! 941667
964083 84285This internet website is my inspiration , truly excellent layout and perfect topic matter. 860035