గెలిచినా ఓడినా రోజాకి మంత్రి పదవి ఖాయమే

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,682FansLike
57,764FollowersFollow

చిత్తూరు జిల్లా నగిరి ఎమ్మెల్యేగా 2014 ఎన్నికల్లో గెలిచిన రోజా ఈ సారి కూడా ఘన విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ ముగిసి బ్యాలెట్‌ బాక్స్‌లో ప్రజా తీర్పు నిక్షిప్తమైంది కనుక, కౌంటింగ్‌ రోజునే ఎవరి జాతకాలు ఏంటో తెలుస్తాయి. మామూలుగా అయితే పోటీ చేసిన అభ్యర్ధులకు గెలుపు, ఓటములపై విపరీతమైన ఆందోళన ఉంటుంది. రోజా ఇందుకు అతీతమేమీ కాదు. కానీ ఆమె ధీమాగా కనిపిస్తున్నారు. కారణమేంటంటే అధికార పార్టీ సర్వేలో కూడా రోజా గెలుస్తారని తేలిందట.

వాస్తవానికి ప్రీ పోల్‌ అంచనాలు రోజాకి వ్యతిరేకంగా వచ్చాయట. పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ప్రభావం రోజాకి మైనస్‌గా మారుతుందని కొన్ని విశ్లేషణలు వినిపించాయి. దాంతో అప్పట్లో రోజా కూడా కొంత ఆందోళన చెందారు. తన వాస్తవ వ్యవహార శైలికి భిన్నంగా ఎన్నికల ప్రచారంలో సరికొత్తగా కనిపించారు రోజా. అనవసర రాజకీయ విమర్శలు పక్కన పెట్టి, ఓటర్లను ఆకట్టుకునేందుకు చాలా హుందాగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో క్లీన్‌గా ఎన్నికల ప్రచారంలో అందరి మెప్పునూ పొందిన నేతగా రోజా గురించి అంతా చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉంటే, ఎన్నికల కంటే చాలా ముందే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రోజాకి ప్రత్యేకమైన భరోసా ఇచ్చారట. ఆ ప్రత్యేకమైన భరోసా ఏంటంటే మంత్రి పదవి అనీ సమాచారమ్‌. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావజాలాన్ని చాలా గట్టిగా వినిపించడంలో రోజా తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఈ క్రమంలో అధికార తెలుగు దేశం పార్టీ నుండి ఆమె ఎదుర్కొన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఒక్క మాటలో చెప్పాలంటే, అధికార పార్టీ వేధింపులకు తీవ్రంగా ఇబ్బంది పడిన వైసీసీ నేతల్లో వైఎస్‌ జగన్‌ మొదటి ప్లేస్‌లో ఉంటే, రెండో ప్లేస్‌ రోజాదే.

రోజా పట్ల ఉన్న నమ్మకం, పార్టీ కోసం ఆమె పడ్డ కష్టానికి తగిన గుర్తింపు ఇవ్వాలన్న ఆలోచనతో వైఎస్‌ జగన్‌ ఆమెకు మంత్రి పదవిపై భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. అది కూడా గెలిచినా, ఓడినా పదవి ఖాయమనే భరోసా ఇవ్వడమంటే మామూలు విషయం కాదు. ఇదిలా ఉంటే, ఓడినా అన్న చర్చకే ఆస్కారం లేదనీ మెజార్టీ గురించి తప్ప ఇంకో ఆలోచనే తమకు లేదనీ రోజా గెలుపుపై వైసీపీ నేతలు అంటున్నారు. గడచిని ఐదేళ్లలో అధికార పార్టీపై రాజకీయ పోరాటం చేస్తూనే, నియోజక వర్గంలో అభివృద్ధి పనుల విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం ప్రదర్శించలేదామె.

గతంలోకి తొంగి చూస్తే తెలుగు దేశం పార్టీ హయాంలోనే రోజాకి మంత్రి పదవి దక్కాల్సి ఉంది. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలిగా పని చేశారామె. అయితే ఎమ్మెల్యేగా ఆమె గెలవలేకపోయారు. టీడీపీ నేతలే తనకు అడ్డు పడ్డారని అప్పుడూ ఇప్పుడూ ఆరోపిస్తూంటారు రోజా. ఎమ్మెల్సీ పదవిని ఒప్పుకుంటే మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు అప్పట్లో మభ్యపెట్టారు. కానీ రోజా అందుకు ససేమిరా అన్నారు. ఎలాగైతేనేం ఇన్నేళ్ల కష్టం ఆమెకు సత్ఫలితాన్నిస్తే మంచిదే కదా.

2 COMMENTS

సినిమా

Sara Arjun: ధురంధర్ బ్యూటీపై ట్రోలింగ్..! సారా అర్జున్ చేసిందిదే..

Sara Arjun: దురంధర్ సినిమా దేశాన్ని షేక్ చేస్తే.. సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా అర్జున్ తన అందంతో యువత హృదయాలను కొల్లగొట్టింది. దీంతో...

పోచమ్మ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన ఆహా

తెలుగు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ aha మరో కొత్త వెబ్ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మిస్టికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన “పోచమ్మ” సిరీస్‌కు సంబంధించిన...

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’ నుంచి హృదయాన్ని తాకే ‘సంచారమే’ పాట...

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘ఎపిక్ - ఫస్ట్ సెమిస్టర్’ సినిమా నుంచి తొలి గీతంగా ‘సంచారమే’ పాటను చిత్ర బృందం విడుదల...

‘మిరాకిల్’ నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్: హెబ్బా పటేల్

తెలుగు సినీ పరిశ్రమలో వినూత్న కథతో రూపొందుతున్న మిరాకిల్ సినిమా ఒక్కసారిగా ఆసక్తిని పెంచుతోంది. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ ఈ చిత్రాన్ని తన కెరీర్‌లో...

అవార్డు గ్రహీతలకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సినీ రంగ స్పెషల్ అవార్డులు–2025 సందర్భంగా పలువురు ప్రముఖులకు గౌరవం దక్కింది. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy అవార్డు...

రాజకీయం

పెనుమూలిలో కొత్త లైబ్రరీ భవనం ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి మరో అడుగు పడింది. దుగ్గిరాల మండలం పెనుమూలి గ్రామంలో పునర్ నిర్మించిన గ్రామీణ గ్రంథాలయ భవనాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో...

నులకపేటలో కొత్త కమ్యూనిటీ హాల్ ప్రారంభం

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా తాడేపల్లి పట్టణంలోని నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. స్థానిక ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మించిన ఈ...

డోన్ సభలో ఫిర్యాదు.. వేదికపైనే అధికారులకు చంద్రబాబు వార్నింగ్

కర్నూలు జిల్లా డోన్‌లో జరిగిన బహిరంగ సభలో ఒక రైతు తన భూమి సమస్యను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చిన ఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రజల సమక్షంలోనే అధికారులను ప్రశ్నిస్తూ సమస్య...

విజయా బ్రాండ్‌పై లీజు వివాదం.. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు

తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా విశ్వాసాన్ని సంపాదించుకున్న విజయా డెయిరీ బ్రాండ్‌పై ఇప్పుడు వివాదం నెలకొంది. గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయా బ్రాండ్‌ను ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇచ్చిన విధానం తీవ్ర చర్చకు దారితీస్తోంది....

సభ్యత్వాల కోసం ‘సాధక్’లకు సహకరించండి: నాగబాబు పిలుపు

జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని ఎమ్మెల్సీ కె. నాగబాబు పిలుపునిచ్చారు. సభ్యత్వాలు నమోదు చేసే ‘సాధక్’లకు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పూర్తి స్థాయిలో సహకరించాలని ఆయన సూచించారు....

ఎక్కువ చదివినవి

హనుమాన్ ఫౌండేషన్ ప్రారంభం: మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య సంఘర్షణను తగ్గించడమే లక్ష్యం – పవన్ కళ్యాణ్

మనుషులకీ వన్యప్రాణులకీ మధ్య పెరుగుతున్న సంఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘హనుమాన్’ పేరుతో ప్రత్యేక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,...

సీఏం , డిప్యూటీ సీఏంల కీలక భేటీ

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్‌డబ్ల్యూఎస్ మరియు అటవీ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై ఇరువురు నాయకులు విస్తృతంగా చర్చిస్తున్నారు. అసెంబ్లీ...

Daily HoroScope: సింహ రాశికి ఉద్యోగ అవకాశాలు మెరుగ్గా – మీన రాశి వారికి కుటుంబంలో శుభవార్తలు

మార్చి 3, 2026 మంగళవారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు మీకు ఉత్సాహంగా ప్రారంభమవుతుంది. పనిలో కొత్త బాధ్యతలు వస్తాయి. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆర్థిక...

అందరూ కూటమి ఎమ్మెల్యేలే.! చంద్రబాబు స్వీట్ వార్నింగ్!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. నిజానికి, చంద్రబాబు వ్యాఖ్యల్ని సంచలన ప్రకటనగా చూడాల్సి వుంటుంది. అదీ, కూటమి...

లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని వస్తున్న ప్రచారం కూటమి పార్టీల మధ్య విభేదాలు సృష్టించేందుకే!

గత కొన్నాళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ప్రశ్న సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది — నారా లోకేష్ ముఖ్యమంత్రి అవుతారా? ముఖ్యంగా ఉగాది తర్వాత సీఎం మార్పు జరిగే అవకాశముందంటూ కొన్ని వర్గాలు...