ఐపీఎల్ 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్ గా టీమిండియా వికెట్ కీపర్ రిషిబ్ పంత్ ను మేనేజ్ మెంట్ ప్రకటించింది. జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయంతో ఐపీఎల్కు పూర్తిగా దూరం కావడమే పంత్ కు కెప్టెన్సీ దక్కేలా చేసింది. ఈమేరకు జట్టు ఫ్రాంచైజీ అధికారికంగా వెల్లడించింది. ఇంగ్లండ్తో తొలి వన్డేలో శ్రేయాస్ అయ్యర్ గాయపడ్డాడు.
ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో బంతిని ఆపేందుకు డైవ్ చేయడంతో శ్రేయాస్ భుజం గట్టిగా నేలను తాకింది. అప్పుడే మైదానంలో విలవిల్లాడిపోయిన అయ్యర్ కు గాయం చాలా తీవ్రమైందని వైద్యులు తేల్చారు. దీంతో తర్వాతి ఇంగ్లాండ్ మ్యాచ్ లకే కాదు.. ఇప్పుడు ఐపీఎల్ కు, ఆగస్టులో భారత్ వెళ్లే ఇంగ్లండ్ పర్యటనకు, సెప్టెంబర్లో స్వదేశంలో జరగనున్న న్యూజిలాండ్, సౌత్ఆఫ్రికా టీ20 సిరీస్లకు కూడా పూర్తిగా దూరమయ్యాడు.
492821 863891quite good post, i surely really like this website, keep on it 50518
315257 524489somehow discovered your website when i was kind of stoned. good read 837115