‘ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు’ అంటూ మంత్రి కొడాలి నాని మరోసారి ఫైర్ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ సిద్ధాంతాలను, ఆశయాలను చంద్రబాబు తుంగలో తొక్కారు. నిన్న జరిగింది టీడీపీ ఆవిర్భావ దినోత్సవం కాదు.. పగటి వేషగాళ్ల డ్రామా. ప్రజలే దేవుళ్లని ఎన్టీఆర్ అంటే.. చంద్రబాబు బూతులు తిడుతున్నారు. వైసీపీకి ఓట్లేశారని వాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదు. లోకేశ్ ను ఓడించడం.. పార్టీ ఓడిపోవడాన్ని చంద్రబాబు జీర్ణించుకోవడం లేదు’.
‘చంద్రబాబు సింగపూర్ కు అప్పిచ్చారా? రూ.3 లక్షల 60 వేల కోట్లు అప్పులు తెచ్చి దుబారా చేస్తే.. పేదలను ఆదుకునేందుకు సీఎం జగన్ అప్పులు తెచ్చారు. చంద్రబాబు బతుకంతా వ్యవస్థలను మేనేజ్ చేయడం, స్టేలు తెచ్చుకోవడంతోనే సరిపోయింది. ప్రజాబలంతో సీఎం అయిన నాయకుడు వైఎస్ జగన్. తిరుపతిలో 5 లక్షలకుపైగా మెజార్టీతో వైసీపీ గెలుపు ఖాయం’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.
361423 307875Read more on that Post.Useful info. 31919
211653 249244Spot ill carry on with this write-up, I truly feel this site requirements a terrific deal more consideration. Ill oftimes be once much more to see far a lot more, a lot of thanks that information. 462467