ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం ఆగడంలేదు. మన దేశంలో కూడా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం కేసులపరంగా భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. ఈ మహమ్మారిని అరికట్టడానికి శాస్త్రవేత్తలు తమ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రష్యా ఈ విషయంలో వ్యాక్సిన్ తీసుకొచ్చినా.. దానిపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ప్రయోగాలు పూర్తిచేసుకునే టీకాలు ఆరు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించడం ఒక్కటే మానవాళి ముందున్నమార్గం.
రోగనిరోధక శక్తి పెంచుకునే ఆహారం తీసుకోవడంతోపాటు సాధ్యమైనంత వరకు బయటకు రాకుండా ఇంట్లో ఉండటమే ఉత్తమం. పరిస్థితి ఇలా ఉంటే కొంతమంది మాత్రం చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తూ.. అలా చేస్తే కరోనా రాదు, ఇలా చేస్తే వైరస్ పోతుంది అని చెప్పడం విస్తు గొలుపుతోంది. ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో కొంతమంది బీజేపీ నేతలు అత్యుత్సాహం చూపిస్తుంటారు.
తాజాగా బీజేపీ ఎంపీ సుఖ్ బీర్ సింగ్.. కరోనా పోవడానికి ఓ చిట్కా చెప్పారు. బురదలో కూర్చుని ఒళ్లంతా దానిని పూసుకుని, శంఖం ఊదితే ఈ మహమ్మారి మన దరి చేరదని పేర్కొన్నారు. అంతేకాదు.. ఆయన అలా ఒళ్లంతా బురద పూసుకుని శంఖం ఊది చేసి చూపించారు. ’’మన ఊపిరితిత్తులు, మూత్రపిండాలు సమర్థంగా పనిచేస్తుంటే మనం ఆరోగ్యంగా ఉన్నట్టే. శంఖం గట్టిగా ఊదగలిగితే అవి సక్రమంగా ఉన్నట్టే. రోగనిరోధక శక్తి అనేది ఔషధాల నుంచి రాదు. అది సహజంగా ప్రకృతి నుంచి రావాల్సిందే.
బురదలో కూర్చుని గట్టిగా శంఖం ఊదడం ద్వారా కరోనా వ్యాప్తిని నివారించవచ్చు. ప్రజలు ఇంట్లో ఉండకుండా బయటకు వచ్చి ఎండ, వానలతో మమేకమవ్వాలి’’ అని పేర్కొన్నారు. గతంలో కూడా ఆయన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా చుట్టూ మంట వేసి, మధ్యలో కూర్చుని యోగాసనాలు వేయడం ద్వారా వార్తల్లోకి ఎక్కారు. తాజాగా బురదలో కూర్చుని మళ్లీ వార్తల్లోకి వచ్చారు. గతనెలలో కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘావాల్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భాభీజీ అప్పడాలు తింటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనా రాదని వ్యాఖ్యానించారు. దీంతో ఆయనపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి పాజిటివ్ నిర్ధారణ అయింది.
399863 831870Private Krankenversicherung – Nur dann, wenn Sie sich fr die Absicherung ber die Rentenversicherung entschieden haben, dann knnen Sie sich sicher sein, dass Sie im Alter so viel Geld haben, damit Sie Ihren Lebensstandard halten knnen. 678031