ఎఫ్ 2.. గత ఏడాది సంక్రాంతి సందర్బంగా విడుదలై ఎవరు ఊహించని రేంజ్ లో సక్సెస్ అందుకుని ఆ సినిమా దర్శకుడు అనిల్ రావిపూడి ని స్టార్ దర్శకుల పక్కన నిలబెట్టిన సినిమా. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రిన్ హీరోయిన్స్ గా రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇప్పుడు దానికి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. సూపర్ స్టార్ మహేష్ బాబుతో అనిల్ రావిపూడి తీసిన సరిలేరు నీకెవ్వరూ సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తరువాత తాను ఎఫ్ 2 కు సీక్వెల్ చేస్తానని చెప్పాడు దర్శకుడు.
ప్రస్తుతం ఎఫ్ 3 కోసం ముక్యంగా మాస్ రాజా రవితేజ పేరు వినిపిస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ లతోపాటు హీరో రవితేజ కూడా నటిస్తాడట. ఈ ముగ్గురు హీరోలు కలిస్తే కామెడీ కేకలు పుట్టిస్తుందని దర్శకుడి నమ్మకం. అందుకే రవితేజ తో చర్చలు జరుపుతున్నాడట దర్శకుడు. దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమా మార్చ్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయట. సినిమాను మాత్రం వచ్చే సంక్రాంతికి విడుదల చేస్తారని టాక్.
ఈ సినిమా విషయంలో అటు రవితేజ కూడా పాజిటివ్ గా ఉన్నాడట, ఇదివరకే అనిల్ దర్శకత్వంలో రవితేజ నటించిన రాజా ది గ్రేట్ సినిమా మంచి విజయం సాధించిన నేపథ్యంలో మళ్ళీ అనిల్ తో పనిచేసేందుకు రవితేజ సిద్ధంగా ఉన్నాడు. తాజాగా అయన నటించిన డిస్కో రాజా సినిమా రేపు విడుదల కానుంది. సో ఎఫ్ 3 విషయంలో రవితేజ ఉన్నడా లేదా అన్నది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
752059 452398Hey there! Wonderful stuff, please do tell us when you post again something related! 54294