Switch to English

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,757FansLike
57,764FollowersFollow

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో అంచనా వేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మే 13 న పోలింగ్ జరిగింది. మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రంలో 82.37% పోలింగ్ నమోదయింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తయింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బిజెపి ల కూటమి అధికారంలోకి రానుందని తేలింది.

ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి..

Rise: టీడీపీ కూటమి కి 113-122 సీట్లు, వైసీపీ కి 48-60 సీట్లు ఇతరులకు 0-1 సీట్లు వస్తాయి.

జనగళం: కూటమి 104-118, వైసీపీ 44-57, ఇతరులు 0 సీట్లు గెలుచుకుంటారు.

చాణక్య స్ట్రాటజీస్: కూటమి 114-125, వైసీపీ 39-49, ఇతరులు 0-1 సీట్లు కైవసం చేసుకుంటారు.

పయనీర్: కూటమి 144, వైసీపీ 31, ఇతరులు 0.

పీపుల్ పల్స్: కూటమి 111 – 135, వైసీపీ 45 -60, ఇతరులు 0.

కేకే సర్వీస్: కూటమి 161, వైసీపీ 14, ఇతరులు 0.

లోక్ సభ ఫలితాలు ఇలా…

ఇండియా టీవీ: కూటమి 19-21 సీట్లు, వైసీపీ 3-5 సీట్లు, ఇతరులు 0.

రైజ్: కూటమి 17 – 20 సీట్లు, వైసీపీ 7 – 10 సీట్లు, ఇతరులు 0.

చాణక్య స్ట్రాటజీస్: కూటమి 17-18 సీట్లు, వైసీపీ 6-7 సీట్లు, ఇతరులు 0.

పయనీర్: కూటమి 20 సీట్లు, వైసీపీ 5 సీట్లు, ఇతరులు 0.

పీపుల్స్ పల్స్: కూటమి 17-19 సీట్లు, వైసీపీ 3-5 సీట్లు, ఇతరులు 0.

కేకే సర్వేస్: కూటమి 25 సీట్లు, వైసీపీ 0, ఇతరులు 0.

రాష్ట్రంలో 175 స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మంగళగిరి నుంచి నారా లోకేష్ తో సహా 40 మంది బరిలో ఉండగా.. కుప్పం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా 13 మంది పోటీలో నిలిచారు. ఇక ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా 13 మంది పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో 27 మంది బరిలో నిలిచారు. 175 నియోజకవర్గాలకు గాను 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో అత్యధికంగా తిరుపతి నియోజకవర్గం నుంచి 46 మంది పోటీ చేయగా.. అనకాపల్లి జిల్లా చోడవరం లో ఆరుగురు పోటీలో నిలిచారు.

సినిమా

ఎగ్జిబిటర్ల తీర్మాణం.. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్..

తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు (థియేటర్ల ఓనర్లు) సంచలన నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లను అద్దెలతో నడిపించే పరిస్థితి లేదని.. తమకు సినిమాలో పర్సెంటేజీ ఇవ్వాల్సిందే అంటూ తేల్చి...

Ram Charan: గ్లోబల్ స్టార్ కు కితాబిచ్చిన గ్లోబల్ మీడియా

Ram Charan: నేటి రోజుల్లో ఎవరైనా ఫేమస్ కావాలంటే పబ్లిసిటీ ముఖ్యం. సినిమా హీరోలకు మరీ ముఖ్యం. ఏ భాష హీరో అయినా పాన్ ఇండియా...

Ntr-Rajamouli: ఎన్టీఆర్-రాజమౌళిపై దాదాసాహెబ్ ఫాల్కే మనవడి కామెంట్స్ వైరల్..!

Ntr-Rajamouli: భారతీయ సినిమాకు పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తెరకెక్కించేందుకు బాలీవుడ్ సిద్ధమైంది. అమీర్ ఖాన్ హీరోగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందనే...

‘సింగిల్’ ని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్.. అల్లు అరవింద్

సింగిల్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు అల్లు అరవింద్ స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీ విష్ణు హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో...

చిరు-అనిల్ మూవీలో నయనతార ఫిక్స్.. క్రేజీ వీడియో..

మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి మూవీపై రోజుకొక అప్డేట్ ఇస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్ గురించి ఇప్పటికే చాలా చర్చలు జరిగాయి. చాలా మంది పేర్లు వినిపించాయి....

రాజకీయం

లిక్కర్ స్కామ్.! వైసీపీ ఎందుకంతలా ఉలిక్కిపడుతోంది.! పెద్ద తలకాయ్ ఎవరు?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా ఉలిక్కిపడింది.. లిక్కర్ స్కామ్ నేపథ్యంలో. విజయ సాయి రెడ్డి వికెట్ పడుతుందని తొలుత వైసీపీ వర్గాల్లో చర్చ జరిగింది. కానీ, ఎంపీ పదవికీ, వైసీపీకి రాజీనామా చేసిన...

Pawan Kalyan-Lokesh: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదం.. పవన్ కల్యాణ్, లోకేశ్ దిగ్భ్రాంతి

Pawan Kalyan-Lokesh: హైదరాబాద్ నగరం చార్మినార్ ప్రాంతంలోని గుల్జార్ హౌస్ ప్రాంతంలో ఈరోజు ఉదయం ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దుర్ఘటనలో 17 మంది మృతి చెందడం.. మృతుల్లో ఇద్దరు చిన్నారులు,...

Nara Lokesh: ప్రధాని మోదీని కలిసిన మంత్రి లోకేశ్.. ‘యువగళం’ పుస్తకం ఆవిష్కరణ

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్ కుటుంబసమేతంగా శనివారంనాడు న్యూఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఇటివల ప్రధాని అమరావతి వచ్చిన సందర్భంలో...

పాకిస్థాన్ వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం.. పవన్ కల్యాణ్‌ ఫైర్..

పాకిస్థాన్ మన భారతదేశం జోలికి వస్తే వాళ్ల ఇళ్లలోకి వెళ్లి కొడుతాం అని పవన్ కల్యాణ్‌ ఫైర్ అయ్యారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను పెంచి పోషిస్తోందని.. అలాంటి వారిని అస్సలు క్షమించకూడదు అంటూ తెలిపారు....

లిక్కర్ స్కామ్: అన్యాయం, అక్రమం.. అంటూ వైసీపీ గగ్గోలు.!

దేశాన్ని కుదిపేసింది ఢిల్లీ లిక్కర్ స్కామ్. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రిగా వున్న సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. మంత్రి సహా ముఖ్యమంత్రి కూడా జైలుకు వెళ్ళారు....

ఎక్కువ చదివినవి

ఓటీటీలో రాబిన్ హుడ్ కు 50 మిలియన్ల స్ట్రీమింగ్ మినిట్స్‌..

నితిన్ హీరోగా వచ్చిన రాబిన్ హుడ్ ఓటీటీలో దూసుకుపోతోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మే10 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైనప్పటి నుంచి...

Geethanjali: ప్రేమకథే కానీ, దృశ్యకావ్యం.. నిత్య యవ్వన ‘గీతాంజలి’కి 36 ఏళ్లు

Geethanjali: సినిమాలకు క్రౌడ్ పుల్లర్స్ యూత్. సినిమాకి ఎవర్ గ్రీన్ కంటెంట్ లవ్. రెండింటికీ అవినాభావ సంబంధమే ఉంది. అందుకే ప్రేమకథలది బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములా. యువత ధియేటర్లకు పరుగులు పెడతారు. ఫ్యామిలీ...

Peddi: “పెద్ది” ఆడియో..! రజినీకాంత్ తర్వాత రామ్ చరణ్ కే దక్కిన ఆ క్రేజ్..

Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "పెద్ది". ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచింది. సినిమాకు ఎ.ఆర్.రెహమాన్...

ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం..

యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ కొత్త మూవీ ప్రారంభం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో బేబీ కాంబో రిపీట్ అవుతోంది. ఆనంద్,...

Ram Charan: రామ్ చరణ్ కు బౌన్సర్ గా.. మైక్ టైసన్ కే చెమటలు పట్టించిన బాక్సర్..

Ram Charan: లండన్ లోని ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటైన సంగతి తెలిసిందే. అయితే.. ఇదే పర్యటనలో రామ్ చరణ్ ను ప్రముఖ...