దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా సంస్థలు, సర్వే సంస్థలు ప్రజల దగ్గర నుంచి అభిప్రాయాలు సేకరించి ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రానుందో అంచనా వేశాయి. ఆంధ్ర ప్రదేశ్ లో మే 13 న పోలింగ్ జరిగింది. మునుపెన్నడు లేని విధంగా రాష్ట్రంలో 82.37% పోలింగ్ నమోదయింది. మరోవైపు లోక్ సభ ఎన్నికల పోలింగ్ కూడా పూర్తయింది. తాజాగా వెలువడిన ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం-జనసేన-బిజెపి ల కూటమి అధికారంలోకి రానుందని తేలింది.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి..
Rise: టీడీపీ కూటమి కి 113-122 సీట్లు, వైసీపీ కి 48-60 సీట్లు ఇతరులకు 0-1 సీట్లు వస్తాయి.
జనగళం: కూటమి 104-118, వైసీపీ 44-57, ఇతరులు 0 సీట్లు గెలుచుకుంటారు.
చాణక్య స్ట్రాటజీస్: కూటమి 114-125, వైసీపీ 39-49, ఇతరులు 0-1 సీట్లు కైవసం చేసుకుంటారు.
పయనీర్: కూటమి 144, వైసీపీ 31, ఇతరులు 0.
పీపుల్ పల్స్: కూటమి 111 – 135, వైసీపీ 45 -60, ఇతరులు 0.
కేకే సర్వీస్: కూటమి 161, వైసీపీ 14, ఇతరులు 0.
లోక్ సభ ఫలితాలు ఇలా…
ఇండియా టీవీ: కూటమి 19-21 సీట్లు, వైసీపీ 3-5 సీట్లు, ఇతరులు 0.
రైజ్: కూటమి 17 – 20 సీట్లు, వైసీపీ 7 – 10 సీట్లు, ఇతరులు 0.
చాణక్య స్ట్రాటజీస్: కూటమి 17-18 సీట్లు, వైసీపీ 6-7 సీట్లు, ఇతరులు 0.
పయనీర్: కూటమి 20 సీట్లు, వైసీపీ 5 సీట్లు, ఇతరులు 0.
పీపుల్స్ పల్స్: కూటమి 17-19 సీట్లు, వైసీపీ 3-5 సీట్లు, ఇతరులు 0.
కేకే సర్వేస్: కూటమి 25 సీట్లు, వైసీపీ 0, ఇతరులు 0.
రాష్ట్రంలో 175 స్థానాలకు ఎన్నికలు జరిగినప్పటికీ మంగళగిరి, పిఠాపురం, కుప్పం, పులివెందుల స్థానాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. మంగళగిరి నుంచి నారా లోకేష్ తో సహా 40 మంది బరిలో ఉండగా.. కుప్పం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సహా 13 మంది పోటీలో నిలిచారు. ఇక ఎన్నికల సందడి మొదలైనప్పటి నుంచి హాట్ టాపిక్ గా మారిన పిఠాపురం స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సహా 13 మంది పోటీ చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పోటీ చేస్తున్న పులివెందుల నియోజకవర్గంలో 27 మంది బరిలో నిలిచారు. 175 నియోజకవర్గాలకు గాను 2,387 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. ఇందులో అత్యధికంగా తిరుపతి నియోజకవర్గం నుంచి 46 మంది పోటీ చేయగా.. అనకాపల్లి జిల్లా చోడవరం లో ఆరుగురు పోటీలో నిలిచారు.