వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు, పదివేల మందితో పులివెందులలో బహిరంగ సభ నిర్వహిస్తారట. అదిరిందయ్యా రాజుగారూ.! సొంత నియోజకవర్గం నర్సాపురం వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదుగానీ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో బహిరంగ సభ పెట్టడమా.? అదీ, పది వేల మందితో.! పులివెందుల రాజకీయాలు ఎలా వుంటాయో వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజుకి తెలియదని ఎలా అనుకోగలం.? తెలిసీ, ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నారంటే.. మేటర్ చాలా సీరియస్ అనే అనుకోవాలి.
అయితే, కరోనా పేరు చెప్పి ఢిల్లీకి పరిమితమైపోయిన నర్సాపురం ఎంపీ, సొంత నియోజకవర్గంలో తన దిష్టిబొమ్మల్ని వైసీపీ నేతలు తగలబెడుతున్నా.. అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. పైగా, రఘురామకృష్ణరాజుకి కేంద్రం ప్రత్యేక భద్రత కూడా కల్పించింది. అన్నట్టు, రఘురామకృష్ణరాజు అమరావతికి కూడా వెళతానన్నారు. అమరావతిలో రైతుల్ని కలిసి వారి కోసం యాత్ర చేస్తానని అన్నారు.
నర్సాపురం యాత్ర జరిగేదెప్పుడో, అమరావతి యాత్ర జరిగేదెప్పుడో.! అవేవీ తేలలేదుగానీ, ఇప్పుడిక పులివెందుల యాత్ర అంటున్నారు. ఒక్కటి మాత్రం నిజం.. వైసీపీని, వైసీపీలోనే వుంటూనే రఘురామకృష్ణరాజు చెడుగుడు అడేస్తున్నారు. ‘బస్తీ మే సవాల్.. దమ్ముంటే నన్ను పార్టీ నుంచి బహిష్కరించండి..’ అని రఘురామ తనదైన స్టయిల్లో సవాల్ విసురుతున్నా, పాపం ఆ సవాల్ని స్వీకరించేంత ధైర్యం అధికార వైసీపీలో కనిపించడంలేదు.
అమరావతి, అంతర్వేది.. ఇలా ప్రతి అంశంలోనూ వైసీపీని ఏకిపారేస్తున్నారు రఘురామకృష్ణరాజు. అన్నట్టు ఈ వైసీపీ ఎంపీగారి వ్యాఖ్యల్లో చాలావరకు ‘లీగల్ పాయింట్స్’ కనిపిస్తున్నాయి. అంతెందుకు, రఘురామకృష్ణరాజు ఏకంగా వైసీపీ ఉనికినే ప్రశ్నించేస్తున్నారు. అది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాదు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ.. అని నినదిస్తోంటే.. ‘కాదు కాదు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’ అని చెప్పలేని దుస్థితి వైసీపీది.
ఏమో, రాజుగారు కాస్త తెగించి పులివెందులలో బహిరంగ సభ పెట్టినా పెట్టొచ్చు. కానీ, అంతకన్నా ముందు ఆయన నర్సాపురం టూర్, అమరావతి టూర్ చేసెయ్యాలి కదా.!
129773 661717magnificent post, very informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im sure, youve a fantastic readers base already! 267692