భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మెదడులో రక్తం గడ్డ కట్టడంతో చికిత్స నిమిత్తం ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రిఫరల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ప్రణబ్ ముఖర్జీకి క్లిష్టమైన శస్త్ర చికిత్స చేశామని కూడా ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ పై ఉన్నారని మంగళవారం విడుదల చేసిన హెల్గ్ బులెటిన్ లో పేర్కొన్నారు. మంగళవారం కూడా ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదని తెలిపారు.
శస్త్రచికిత్స కోసం ఆసుపత్రిలో చేరిన ప్రణబ్ కు కరోనా పరిక్షలు నిర్వహించగా ఆయనకు పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ప్రణబ్ త్వరగా కోలుకోవాలని రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ఆకాంక్షించారు. హోం మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఆస్పత్రికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సోనియా, రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
244530 288571Excellent blog, Im going to spend far more time reading about this subject 367925
218093 377290Some truly howling function on behalf of the owner of this website , dead great subject matter. 93773