Switch to English

జస్ట్‌ ఆస్కింగ్‌: కరోనా ‘పాపం’ రాష్ట్రాలదేనా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

దేశంలో కరోనా వైరస్‌ సామాజిక వ్యాప్తి చెందిందా.? లేదా.? ఈ ప్రశ్నకు ఇప్పటికీ కేంద్రం నుంచి సరైన సమాధానం దొరకడంలేదు. కేంద్రం పిలుపునిచ్చిన మేరకు రాష్ట్రాలు అత్యంత పకడ్బందీగా లాక్‌డౌన్‌ చేపట్టాయి. ఈ క్రమంలో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. మరి, కేంద్రం ఏం చేసినట్లు.?

మద్యం షాపులను తెరవడం దగ్గర్నుంచి.. క్రమక్రమంగా వెసులుబాట్లు కల్పిస్తూ వచ్చిన కేంద్రం, ప్రస్తుతం అన్‌లాక్‌ విషయంలో చాలా జోరుగా అడుగులు వేస్తోంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి – తీసుకోవాల్సిన జాగ్రత్తలకు, ఇతరత్రా అంశాలకు సంబంధించి ముఖ్యమంత్రులతో టెలి కాన్పÛ=రెన్స్‌ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితుల్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ‘సవివరంగా’ తెలియజేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా, పలు అంశాల్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్ళారు.

దాదాపు పది రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా వుందనీ, కొన్ని రాష్ట్రాలు టెస్టులు అత్యద్భుతంగా చేస్తున్నాయనీ, మరికొన్ని రాష్ట్రాలు టెస్టుల్లో వేగం పెంచాలనీ ప్రధాని సూచించారు. టెస్టులు ఎక్కువగా చేస్తోన్న ఆంధ్రప్రదేశ్‌కి ప్రధాని నరేంద్ర మోడీ నుంచి అభినందనలు దక్కినట్లే భావించాలి. తెలంగాణకు మాత్రం చిన్నపాటి సూచన లాంటి హెచ్చరికను ప్రధాని చేశారన్న చర్చ జరుగుతోంది.

అయితే, రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పట్ల కేంద్రం అంతగా ఆందోళన చెందుతున్నట్లు కన్పించడంలేదు. లేకపోతే, కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్రాలతో మరింత విస్తృతంగా కేంద్రం ఎప్పటికప్పుడు చర్చించి, అవసరమైన చర్యలు తీసుకుని వుండాలి. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి చాలా తీవ్రంగా వున్నా, అక్కడ కరిÄనంగా లాక్‌డౌన్‌ అమలు చేయాలన్న విషయంలో కేంద్రం పట్టించుకున్నట్లు కన్పించడంలేదు.

ఇక, తెలంగాణలో టెస్టుల సంఖ్య తక్కువగా వుండడం పట్ల బీజేపీ నేతలు గుస్సా అవుతున్నారు తప్ప.. టెస్టుల సంఖ్య పెంచేలా తెలంగాణ ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకురాలేకపోతోంది. రాష్ట్రాలు కరోనా నేపథ్యంలో ఆర్థికంగా చితికిపోయినా, కేంద్రం తగు రీతిలో ఆదుకోవడంలేదన్న విమర్శల సంగతి సరే సరి. మొత్తంగా చూస్తే, కరోనా వైరస్‌ దేశంలోకి వస్తోన్న తొలి రోజుల్లో ప్రధాని నరేంద్ర మోడీ చాలా యాక్టివ్‌గా కన్పించారు.

అయితే, ఆ యాక్టివ్‌గా వుండడం అనేది క్రమక్రమంగా పబ్లిసిటీ స్టంట్‌లా మిగిలిపోయింది. రాష్ట్రాలు, దేశమే కాదు.. ప్రపంచం మునుపెన్నడూ చూడని సంక్షోభమిది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఆర్థిక పరిస్థితితోపాటు, సామాన్యుడి ఆర్థిక పరిస్థితిని కూడా గుర్తెరిగి కేంద్రం, కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వుంటుంది. కానీ, అంత చిత్తశుద్ధి కేంద్రం నుంచి ఆశించగలమా.?

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...