డార్లింగ్ ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించాడట. దాంతో కుర్రాడు సుజీత్ వణికిపోయాడట. నిర్మాతలు సైతం సుజీత్పై విరుచుకుపడిపోయారట. అన్నిటికీ మించి, బాలీవుడ్ నిర్మాత భూషణ్కుమార్ సైతం, ‘సాహో’ టీమ్పై మండిపడుతున్నాడట. ‘సాహో’ ఫలితం పూర్తిగా బయటకు రాకముందే ‘సాహో’ టీమ్లో లుకలుకలు బయటపడ్డాయట. అయితే, సినిమా రిలీజ్ వరకూ వ్యవహారాల్ని గోప్యంగా వుంచారట. ఇదీ అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.
దర్శకుడు సుజీత్తో ప్రభాస్కి గ్యాప్ వచ్చిందనీ, మొత్తంగా ‘సాహో’ టీమ్లో ఇప్పుడు అసలు కమ్యూనికేషనే లేకుండా పోయిందనీ టాలీవుడ్లో గుసగుసలు విన్పిస్తున్నాయి. అత్యంత ఘోరంగా ‘సాహో’ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసిన విషయం విదితమే. అయితే, సినిమా ఫెయిల్యూర్కి సంబంధించి బాధ్యత అందరిదీ. అయినాగానీ, సుజీత్ని బాధ్యుడిగా చేస్తున్నారట మిగతా అందరూ కలిసి.
శక్తికి మించిన బాధ్యతను తన మీద పెట్టి, భారీతనానికి తగ్గట్టుగా కథని అటూ ఇటూ కుదిపేసినవాళ్ళే ఇప్పుడు తనను నిందిస్తోంటే సుజీత్ తట్టుకోలేకపోతున్నాడట. కానీ, ఏం చేయలేని పరిస్థితి. తనకు అంత పెద్ద ఛాన్స్ ఇచ్చిన ప్రభాస్ని ఇప్పుడు సుజీత్ ఏమీ అనలేడు. తనను నమ్మి అంత ఖర్చు చేసిన నిర్మాణ సంస్థ విషయంలోనూ సుజీత్ పెదవి విప్పే పరిస్థితి లేదు.
నిజానికి, ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్. ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలి. కానీ, సుజీత్ నెత్తిన పడేశారు బాధ్యత అంతా. సినిమా ప్రమోషన్లలో సుజీత్ చాలా తక్కువగా కన్పించాడు. అన్నీ తానే అయి చూసుకున్నాడు ప్రభాస్. ఏదో మొహమాటానికి అలా అలా వచ్చింది హీరోయిన్ శ్రద్ధా కపూర్. చెప్పుకుంటూ పోతే చాలా లోటుపాట్లే వున్నాయి. అవన్నీ ఇప్పుడు బయటకొస్తున్నాయంతే.
581816 991851Ive read several good stuff here. Certainly value bookmarking for revisiting. I surprise how significantly effort you put to create 1 of these excellent informative internet site. 364394