టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ మరియు బాలీవుడ్ లో కూడా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి నటించిన రాధేశ్యామ్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. మొన్నటి వరకు ముంబైలో హడావుడి చేసిన ఈ అమ్మడు ఇప్పుడు చెన్నై ఆ తర్వాత బెంగళూరు తర్వాత హైదరాబాద్ లో చక్కర్లు కొట్టబోతుంది.
పూజా హెగ్డే తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ లతో కలిసి నటించిన ఈమె ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో కూడా నటిస్తోంది. ఈ సమయంలోనే ఈమె కు మరో ముగ్గురు హీరోలతో నటించే ఆసక్తి ఉందని చెప్పుకొచ్చింది. బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ మరియు తమిళ హీరో లు అయిన కమల్ హాసన్ ఇంకా ధనుష్ లతో నటించాలని కోరికగా ఉందని ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి వారితో నటించే అవకాశం ఈ అమ్మడికి ఎప్పటికి దక్కుతుందో చూడాలి.
350561 715315Hi my loved 1! I want to say that this post is incredible, fantastic written and incorporate almost all vital infos. I would like to peer more posts like this . 703034