రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన ఇద్దరు వైసీపీ నాయకులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. వీటితోపాటు తమ మంత్రి పదవులకూ రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా రాజీనామా లేఖ పంపించారు. వీరిద్దరి రాజీనామా లేఖలను మండలి కార్యదర్శికి పంపించగా.. వాటిని పరిశీలించిన చైర్మన్ ఆమోదించారు.
మంత్రి పదవులకూ రాజీనామా సమర్పించిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వాటిని సీఎం జగన్ కు సమర్పించారు. మంత్రి పదవుల రాజీనామాల విషయంలో సీఎం ఆదేశాల మేరకు నడుచుకుంటామని పిల్లి సుభాష్, మోపిదేవి తెలిపారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో తమ పదవులకు రాజీనామా చేయాలనే నిబంధనతో ఈరోజు వారిద్దరూ రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ.. మంత్రి పదవి చేపట్టిన ఈ ఏడాది కాలంలో సీఎం జగన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారని తెలిపారు. కౌన్సిల్ రద్దయ్యే వరకూ ఎమ్మెల్సీగా ఉన్నా అభ్యంతరం లేదని సీఎం చెప్పారని.. అయితే తనకు రాజ్యసభకు ప్రతినిధ్యం వహించడం తన కోరికని సీఎంకు తెలిపినట్టు చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా కష్టమే అని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా శిరోధార్యంగా భావించాల్సిందేనని అన్నారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించిన జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వీరిద్దరితో ఖాళీ అయిన స్థానాల్లో ఎవరిని ఎంపిక చేయాలనేదానిపై పార్టీ అధిష్టానం దృష్టి సారించింది.
304386 847063Sweet internet site, super style and design , genuinely clean and use friendly . 453630
259627 68912if the buffalo in my head could speak german i would not know a god damm thing. What i do know is that the language of art is out of this world. 261521