దేశంలో ఇంటర్నెట్ వాడకం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా వ్యాప్తి కారణంగా విధించిన లాక్ డౌన్ వల్ల నెట్ వాడకం ఎక్కువైంది. ఆన్ లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం విధానాలతోపాటు ఎంటర్ టైన్ మెంట్ కోసం ఓటీటీలపై ఆధారపడటంతో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికం నియంత్రణ సంస్థ(ట్రాయ్) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా గతేడాది మార్చి నాటికి 68.74 కోట్ల మంది వినియోగదారులు ఉండగా.. డిసెంబర్ నాటికి వారి సంఖ్య 74.74 కోట్లకు చేరింది. అలాగే బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. గతేడాది జూన్ లో 55.41 శాతం మంది ప్రజలకు బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ ఉండగా.. సెప్టెంబర్ కు అది 57.29 శాతానికి పెరగడం గమనార్హం.
విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు, ఉద్యోగులకు వర్క్ ఫ్రం విధానం అమలుకావడంతోనే ఈ మేరకు కనెక్షన్లు కూడా పెరిగాయి. లాక్ డౌన్ కాలంలో డేటా వినియోగం భారీగా ఉండగా.. సడలింపుల తర్వాత వినియోగం తగ్గింది. గతేడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఒక వ్యక్తి నెలవారీ డేటా వినియోగం సగటును 12.15 జీబీ ఉండగా.. జూలై నుంచి సెప్టెంబర్ నాటికి అది 11.96 జీబీకి తగ్గింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటర్నెట్ కనెక్షన్ల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 2.60 కోట్ల కనెక్షన్లు ఉండగా.. కరోనా సమయంలో అవి 2.66 కోట్లకు పెరిగాయి. రెండు రాష్ట్రాల్లో మొత్తం కనెక్షన్ల సంఖ్య 5.91 కోట్ల నుంచి 6.1 కోట్లకు పెరిగాయి. కనెక్షన్ల పరంగా మహారాష్ట్ర సర్కిల్ మొదటి స్థానంలో ఉండగా.. ఏపీ, తెలంగాణ ఉమ్మడి సర్కిల్ రెండో స్థానంలో ఉంది.
568487 109968Some actually nice stuff on this internet website , I enjoy it. 753962