Switch to English

జగన్ ను హెచ్చరించిన పవన్.. ఆ ఎంపీతో జాగ్రత్త..

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ మేనియాతో చాలామంది గత ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. కనీసం వాళ్ళ ముఖాలు ప్రజలకు తెలియకపోయినా జగన్ మేనియా, ఫ్యాన్ గుర్తు చూసి ఓటు వేశారు. అలాంటి వ్యక్తుల్లో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ఒకరు. అంతకు ముందు అయన సిఐగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు అయన తన పదవికి రాజీనామా చేసి వైకాపాలో జాయిన్ అయ్యారు.

వైకాపాలో జాయిన్ అయ్యాక ఫ్యాన్ గాలిలో అయన కూడా విజయం సాధించాడు. అనంతపురం పాలిటిక్స్ అంటే గుర్తుకు వచ్చేది జెసి సోదరులు. జెసి దివాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. 2014 నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. ఇటీవలే చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో పర్యటించారు. అక్కడి నాయకులు కార్యకర్తలతో మాట్లాడారు. ఈ సమయంలో జెసి దివాకర్ రెడ్డి పోలీసుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమే అని, పోలీసుల చేత బూట్లు నాకిస్తాను అని చెప్పడం వివాదాస్పదంగా మారింది. దీనిపై ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించి, పోలీసుల బూట్లు శుభ్రం చేసి, వాటిని ముద్దాడాడు. నాయకులకు రక్షణ కల్పించేది పోలీసులే అని గుర్తుపెట్టుకోవాలని పోలీసులు లేకుంటే మీకు రక్షణ ఉండదని అన్నారు. దీనిపై జెసి కుమారుడు పవన్ స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.

గోరంట్ల మాధవ్ జగన్ మేనియాతోనే గెలిచారని, ఒకేసారి మీసం టిప్పు ఎంపీ అయ్యారని, ఇప్పుడు బూట్లు ముద్దాడి జగన్ సీఎం కావాలని చూస్తున్నారని, జగన్ ఆ ఎంపీతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటి జగన్ కు, ముఖ్యమంత్రి అయ్యాక ఉన్న జగన్ కు చాలా తేడా ఉందని, ప్రతిపక్షంలో ఉన్న ఆవేశం ముఖ్యమంత్రి అయ్యాక ఉండదని, రాజకీయాలంటే అలానే ఉంటాయని అన్నారు.

ఎన్నికలకు ముందు వైకాపా నుంచి అఫర్ వచ్చినా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగాలని నిర్ణయం తీసుకున్నామని, అందుకే తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతున్నామని పవన్ పేర్కొన్నారు. మరి పవన్ చెప్పినట్టుగా ఆ ఎంపీతో జగన్ కు ఇబ్బంది ఉంటుందా చూద్దాం.

6 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...