Pawan Kalyan: ఏపీ సీఎం జగన్ (CM YS Jagan) రాష్ట్రంలో ఎక్కడ పర్యటనకు వెళ్తున్నా అక్కడ చెట్ల నరికివేత తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. దీనిపై జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ.. వైసీపీ పాలనలో వృక్షాలు సైతం విలపిస్తున్నాయ’ని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చెట్లు నరికిన ఫొటోలను ట్వీట్ చేశారు. విచక్షణారహితంగా చెట్లు నరకొద్దని సీఎస్ అధికారులకు చెప్పాలని కోరారు.
‘కోనసీమలో కొబ్బరి చెట్లను ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఈ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకునే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి. వృక్షో రక్షతి రక్షితః’ అని రాసుకొచ్చారు. ఈ సందర్భంగా.. జంధ్యాల పాపయ్య శాస్త్రి ‘పుష్ప విలాపం’ పద్యాలను పవన్ ఊటంకించారు.
“ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుడా
మైలపడిపోయెకోయి నీ.. మనుజ జన్మ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టి చేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ” అనే పద్యాన్ని కూడా పోస్ట్ చేశారు.
వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి..
An unprecedented procedure to cut trees while AP CM travels.
These photos are from Amalapuram.When you don’t read ‘Pushpa Vilapam’ by Sri Jandyala Papayya Sastry’, When you don’t understand Jagadeesh chandrabose experiments ,how… pic.twitter.com/z7Qjv6f6ov
— Pawan Kalyan (@PawanKalyan) July 24, 2023