Switch to English

మత ప్రస్తావన లేని రాజకీయమంటే ఇదీ.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘మత ప్రస్తావన లేని రాజకీయం అంటే, మతాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వుండడం కాదు. అన్ని మతాలకు న్యాయం చేసి మత విద్వేషాలు లేకుండా చేయడం..’ అంటూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, తిరుపతిలో వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడుల వ్యవహారంపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘ఇవే దాడులు, చర్చిలపైన జరిగినా మసీదులపైన జరిగినా.. మొత్తం దేశం కదిలొస్తుంది.. ప్రపంచమంతా స్పందిస్తుంది.. కానీ, హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతుంటే ఎవరూ స్పందించరా.? స్పందించకూడదా.?’ అని ప్రశ్నించిన జనసేన అధినేత, ‘డీజీపీ స్థాయి వ్యక్తికి స్వేచ్ఛ వుంటే ఎంతో చేయగలరు.. కానీ, వారు పొలిటికల్‌ బాసులు పెట్టే ఆంక్షల వలన స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారు.. అందుకే నేను వారిని ఏమీ అనలేను..’ అని చెప్పారు.

కాగా, జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం తనవంతుగా 30 లక్షల విరాళాన్ని అందజేశారు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల విషయమై స్పందిస్తూ, పక్షపాతంతో వ్యవహరించే అధికారుల్ని తొలగించాల్సిందిగా ఎన్నికల సంఘాన్ని కోరతామని చెబుతూ, జరిగిన తప్పుల్ని సరిదిద్ది ఎన్నికలు నిర్వహించాలనీ డిమాండ్‌ చేశారు. ‘సమాజాన్ని విడగొట్టే మాటలు మాట్లాడను, రాజకీయాలు చేయను. సమాజాన్ని కలపాలనే ఆలోచన వున్నవాడిని. నేను స్వతహాగా హిందువుని అయినా, అన్ని మతాలనూ సమానంగా గౌరవించే వ్యక్తిని..’ అని పవన్‌ చెప్పుకొచ్చారు.

కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై వివాదం రాజుకున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై స్పందిస్తూ, అందరికీ ఆమోదయోగ్యమైన దిశలో ఆ చట్టాల్ని కేంద్రం అమలు చేస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు జనసేనాని. ‘లాక్‌డౌన్‌ సమయంలో మందు షాపులు తెరిచినప్పుడు, వైసీపీ నేతలు ర్యాలీలు చేసినప్పుడు లేని కరోనా భయం, ఇప్పుడు ఎన్నికలంటే ఎందుకు వస్తోందని పవన్‌ కళ్యాణ్‌ ప్రశ్నించారు.

‘దేవాలయాలపై దాడులకు సంబంధించి మొదటి ఘటన జరిగినప్పుడే తగిన చర్యలు తీసుకుని వుంటే, వరుస ఘటనలు జరిగేవి కావు. ప్రభుత్వం ఈ దాడులు చేయిస్తోందనిగానీ, అధికార పార్టీ చేయిస్తోందనిగానీ నేను అనను. కానీ, ప్రభుత్వం ప్రదర్శించిన బాధ్యతారాహిత్యమే ఈ ఘటనలకు కారణం’ అని జనసేనాని కుండబద్దలుగొట్టేశారు. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారన్నదానిపై వారం రోజుల్లో స్పష్టత వస్తుందన్నారు పవన్‌ కళ్యాణ్‌.

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...