Switch to English

పవన్ కళ్యాణ్ గోదారి రాజకీయం: పవర్ ఫుల్ స్కెచ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో రోడ్ల గురించి, ఆ రోడ్లపై ప్రయాణించే వారి నరక యాతన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదొక నరకం. రెండున్నరేళ్లుగా రోడ్లని ప్రభుత్వం వదిలేసింది. ప్రజల ప్రయాణ వెతల్ని పట్టించుకోవడం మానేసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం చేసి అయినా రోడ్లని బాగు చేయాలని సంకల్పించుకోవడంతో, అధికార వైసీపీ వెన్నులో వణుకు మొదలైంది.

ఎక్కడికక్కడ జనసేన నేతల్నీ, జన సైనికుల్ని అరెస్టులు చేసింది. గృహ నిర్భంధాలు చేసింది. కానీ, జన ప్రవాహాన్నిఆపడం ఎవరి తరమూ కాదని పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటన నిరూపించింది.

తూర్పు గోదావరి జిల్లానే పవన్ కళ్యాణ్ ఎందుకు ఎంచుకున్నారు. ఎందుకంటే, అక్కడ రాజకీయంగా కొంత బాకీ తీర్చుకోవల్సి ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్, గతంలో పవన్ కళ్యాణ్ మీద జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై జనసేన నిరసన వ్యక్తం చేస్తే, వైసీపీ గూండాలు దాష్టీకానికి దిగారు. ఆ జిల్లాలో జన సునామీ ఎలా ఉంటుందో పవన్ చూపించారు.

సీఎం పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. అంటూ నినాదాలు చేస్తూ పవన్ కళ్యాణ్ స్పీచ్‌కి అడ్డం తగిలారు కానీ, లేదంటే పవన్ ప్రసంగం ఇంకో స్థాయిలో ఉండేది. జిల్లాలో ఒక బలమైన సామాజిక వర్గాన్ని పవన్ కళ్యాణ్ ఉత్తేజ పరిచే ప్రయత్నం చేశారు. ఆ సామాజిక వర్గం రాష్ట్ర రాజకీయ పరిస్థితిని అర్ధం చేసుకోవల్సిందిగా కోరారు. రెండు ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ప్రసంగం ఖచ్చితంగా చర్చనీయాంశమవుతుంది.

రెండు జిల్లాల్నీ కలిపే ధవళేశ్వరం బ్యారేజీపై జరగాల్సిన కార్యక్రమమిది. తెలుగు నాట రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టించేలా జనసేనాని, రోడ్లపై శ్రమదానం పేరుతో సరికొత్త రాజకీయానికి తెర లేపారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ప్రజల తరపున నిలబడాలని పిలుపునిచ్చారు. దాష్టీకాలకు పాల్పడుతున్న రాజకీయ నాయకుల నుంచి ప్రజల్ని రక్షించాలని కోరారు.

అదే సమయంలో రాజకీయ వ్యవస్థ ఎంతలా పోలీస్ వ్యవస్థని ఇబ్బంది పెడుతున్నదీ వివరించారు. పోలీసుల ఆవేదనను ఓ కానిస్టేబుల్ కొడుకుగా అర్ధం చేసుకోగలను.. అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు అందర్నీఆలోచింపచేస్తున్నాయి. మొత్తమ్మీద గోదారి కేంద్రంగా పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కోసం తనదైన రాజకీయ రహదారి నిర్మాణాన్ని చేపట్టారని అర్ధం చేసుకోవచ్చు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree). కమలేష్ కుమార్ నిర్మాత. మే24న విడుదలవుతోన్న...