జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్యల్ని అధికారిక బహిరంగ సభల్లో చేస్తోంటే, జనసేన అధినేత మాత్రం, రాజకీయం రాజకీయంగానే చేస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నారు. ప్రభుత్వ అవినీతిని తూర్పారబడుతున్నారు.
వైఎస్ జగన్ పెళ్ళి గురించో, వైఎస్ జగన్ ఇంట్లోని ఆడవాళ్ళ గురించో పవన్ కళ్యాణ్ మాట్లాడాలనుకుంటే ఎంతసేపు.? కానీ, జనసేనాని సంయమనం పాటిస్తున్నారు. ప్రజలు తమను గమనిస్తున్నారన్న సోయ పవన్ కళ్యాణ్లో వుంది, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిలో అది కనిపించడంలేదు. అధికారం.. అనే అహంకారంతో వైఎస్ జగన్ విర్రవీగుతున్నారు.
ఇక, అసలు విషయానికొస్తే వైఎస్ జగన్ సర్కారుపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. పేదలకు ఇళ్ళను ఇచ్చే పథకం ద్వారా దాదాపు 35 వేల కోట్ల రూపాయల నిధులు దారి మళ్ళాయంటూ కేంద్రానికి చేసిన ఫిర్యాదులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తవించారు.
చంద్రబాబు హయాంలో పూర్తయిన టిడ్కో ఇళ్ళను ఇప్పటిదాకా లబ్దిదారులకు జగన్ సర్కారు అందించలేదన్నది పవన్ కళ్యాణ్, ఆ ఫిర్యాదులో పేర్కొన్న కీలక అంశం. పేదలకు ఇళ్ళ స్థలాలంటూ, ఎక్కువ ధరకు భూముల్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందనీ, 30 లక్షలకు పైగా ఇళ్ళు నిర్మిస్తామని చెప్పి, అందులో సగం కూడా నిర్మించలేకపోయిందనీ, కేటాయించిన ఇళ్ళ స్థలాలు నివాసయోగ్యం కాదనీ పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు.
నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ట్యాగ్ చేస్తూ, కేంద్రానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఫిర్యాదుని ట్విట్టర్ ద్వారా చేశారు. కేంద్రానికి పవన్ కళ్యాణ్ చేసిన ఫిర్యాదు జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశమవుతోంది.
ఇళ్ళు కాదు, ఊళ్ళు.. అంటూ పబ్లిసిటీ ఊదరగొట్టేసిన జగన్ సర్కారు, పవన్ కళ్యాణ్ లేవనెత్తిన అంశాలపై సమాధానం చెబుతుందని అనుకోలేం. ఇంకోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించే అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తారంతే.!
@PMOIndia @narendramodi pic.twitter.com/8mgjzWhP9x
— Pawan Kalyan (@PawanKalyan) December 30, 2023