దివంగత నేత వంగవీటి మోహన్ రంగ తనయుడు, విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా, పుష్పవల్లి ల వివాహం ఆదివారం ఘనంగా జరిగింది. కృష్ణా జిల్లా పోరంకి లోని మురళి రిసార్ట్స్ ఈ వేడుకకు వేదిక అయింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pavan Kalyan), ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వివాహ వేడుకకు హాజరై వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.
వీరితో పాటు ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్, ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని, పార్థసారథి, వల్లభనేని వంశీ, గద్దె రామ్మోహన్, డిప్యూటీ స్పీకర్ వేదవ్యాస్, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ తదితరులు ఈ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.