దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రైతులకు పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం జరిగింది. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ సరిహద్దు ప్రాంతాలైన సింఘు, ఘాజీపూర్, టక్రీ.. ప్రాంతాల్లో రైతులు ఢిల్లీలోకి దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిపై వాటర్ క్యానన్స్ (జల ఫిరంగులు) ప్రయోగించారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది.
ఢిల్లీలో ధర్నా చేసేందుకు వస్తున్న రైతులు పెరిగిపోవడంతో పోలీసులు వారిని నగరంలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. తమను ఢిల్లీలోకి అనుమతించాలని వారు కోరగా బురాడీ మైదానంలో ధర్నాకు అనుమతి ఉందని.. అక్కడ నిరసన తెలపాలని సూచించారు. కానీ.. రైతులు ట్రాక్టర్లతో పోలీసులు ఏర్పాటు చేసిన కాంక్రట్ బారికేడ్లను తొలగించి ఢిల్లీలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే వారిపై వాటర్ క్యానన్స్ ప్రయోగించామని పోలీసులు అంటున్నారు.
మరోవైపు రైతులతో చర్చలు జరిపేందుకు కేంద్రం సమ్మతించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒక దఫా చర్చలు జరిగిన విషయం కూడా తెలిసిందే. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై తమకు ఉన్న అభ్యంతరాలను కేంద్రానికి వారు నివేదించారు. ఈ నేపథ్యంలో మరోసారి రైతులకు కేంద్రానికి మధ్య చర్చలు జరుగబోతున్నాయని తెలుస్తోంది. రైతులు మాత్రం తమ డిమాండ్లను కేంద్రం నెరవేర్చేవరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ అంశం జాతీయస్థాయిలో సంచలనం రేపుతోంది.
970207 901728I always was concerned in this topic and stock still am, regards for posting . 47132
932434 233842A weblog like yours need to be earning considerably funds from adsense.~::- 577338
794809 2539I adore your wp style, wherever did you download it by way of? 619770