వివాదాస్పద స్వామీజీ నిత్యానంద గుర్తున్నాడు కాదా..! కిడ్నాప్, అత్యాచారం నేరాల్లో నిందితుడిగా ఉండి.. దేశం విడిచి పారిపోయాడు. ఈక్వెడార్ సమీపంలో సొంత దేశం ‘కైలాస’ను ఏర్పాటు చేసుకుని కరెన్సీ, వెబ్ సైట్, ప్రభుత్వం, విద్య, ఖజానా, వాణిజ్యం, ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఎన్లైటెన్డ్ సివిలైజేషన్’ (జ్ఞానోదయం కలిగిన నాగరికత శాఖ) దేశానికి ఐక్యరాజ్యసమితి గుర్తింపు ఇవ్వాలనే విన్నపం చేస్తున్నారక్కడ. ఎక్కడుందో తెలీని.. సరిహద్దులు లేని దేశం అంటూ ద్వీపాన్ని కొనుగోలు చేసాడు. ఇప్పుడు ఇక్కడకు వస్తే వీసా ఇస్తానని ప్రకటించారు. సౌత్ ఇండియాకు చెందిన ఒక నటిని దేశ ప్రధానిగా ప్రకటించి ఆమెను ‘మా’గా పిలుస్తున్నారని కూడా ఓ వార్త.
ఈక్వెడార్ ప్రభుత్వంలోని కొందరు ప్రముఖులే నిత్యానందకు ఈ దీవి కొనిచ్చారట. అహ్మదాబాద్కు చెందిన ముగ్గురు ప్రముఖులు ‘కైలాస’కు వెళ్లిపోవాలని భావిస్తున్నారట. కేవలం ‘కైలాస’ కేబినెట్ అనుమతిచ్చిన వ్యక్తులు, భారీ విరాళాలు ఇచ్చినవారే ఈ దేశంలోకి వెళ్లగలరట. కైలాసకు జెండా.. ‘వృషభ ధ్వజ’, జాతీయ జంతువు.. నంది, పక్షి.. శరభం, పువ్వు.. కమలం, జతీయ వృక్షం.. మర్రిచెట్టు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం కూడా కైలాసను గుర్తించకపోయినా.. ఇక్కడ అధికారిక భాషలుగా ఇంగ్లీషు, సంస్కృతం, తమిళం ఉన్నాయి. హిందూ రిజర్వు బ్యాంకు ఏర్పాటు చేసి విరాళాలు సేకరించి క్రిప్టో కరెన్సీగా మార్చుకోవాలనేది నిత్యానంద ప్లాన్.
యూఎస్ లోని డల్లాస్ ఐపీతో, పనామాలో 2018 అక్టోబరు 21న ‘కైలాస’ వెబ్ సైట్ నమోదైనట్లు తెలుస్తోంది. ఇది సరిహద్దులు లేని దేశంగా తెలుస్తోంది. స్వేచ్ఛగా హిందూత్వాన్ని పాటించలేని వారి కోసమే కైలాస ఏర్పాటైనట్టుగా తెలుస్తోంది. ఇక్కడ ఉచిత భోజనం, విద్య, వైద్యం లభిస్తాయి. ఇక్కడ కనీసం లక్షమంది ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారట. దీనిపై వీడియో కూడా విడుదల చేసాడు నిత్యానంద. ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాస’ పేరుతో బ్యాంకు ఏర్పాటు చేసి బంగారు నాణేలు విడుదల చేశారు. ప్రపంచం తమ దేశం కరెన్సీని ఆమోదిస్తుందనీ ఇప్పటికే ఒక దేశంతో ఎంవోయూ జరిగినట్టు నిత్యానంద వెల్లడించారు. ఇటీవలే నిత్యానంద ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు.
కైలాసకు రావాలంటే ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకుని ఆస్ట్రేలియా నుంచి కైలాసకు రావొచ్చన్నారు. అయితే.. కేవలం మూడు రోజులే అక్కడ అనుమతి. ఈ మూడు రోజుల్లోనే శివుడిని చూపిస్తానని హామీ కూడా ఇచ్చారు. అయితే.. కైలాసకు భారతీయుల రాకను నిషేధించారు. కరోనా సెకండ్ వేవ్ ఇందుకు కారణం. కైలాసలో ఒక్క కేసు లేదని.. సెకండ్ వేవ్ సందర్భంగా భారత్, బ్రెజిల్, యూరోపియన్ దేశాలు, మలేషియా దేశాల భక్తులకు నో ఎంట్రీ అంటూ ఒక వీడియోను విడుదల చేశారు. అయితే.. కరోనా ఎప్పుడు పోతుందని నెటిజన్ అడిగిన ప్రశ్నకు.. తనలోకి ‘అమ్మన్’ (దేవత) ప్రవేశించిందని, తాను భారత్ లో పెట్టినప్పుడే కరోనా పోతుందని తెలిపారు. మరి.. కరోనాను అంతం చేసేందుకు నిత్యానంద భారత్ వస్తారో లేదో.. ఆయనకే తెలియాలి.
983133 130973have to do 1st? Most entrepreneurs are so overwhelmed with their online business plans that 509947
23444 865336Thanks for this exceptional. I was wondering whether you were preparing of writing related posts to this one. .Maintain up the exceptional articles! 19497
122789 891710very excellent put up, i surely adore this internet web site, keep on it 709462