అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) అంగారకుడిపై అద్భుత విజయం సాధించింది. అది పంపించిన పర్సెవరెన్స్ రోవర్ అంగారక గ్రహంపై విజయవంతంగా దిగింది. ఆ వెంటనే గ్రహానికి చెందిన రెండు చిత్రాలను కూడా భూమికి పంపించింది. గురువారం రాత్రి భారత కాలమానం ప్రకారం 2.25 గంటలకు ఆ రోవర్ అంగారకుడిపై ల్యాండ్ అయింది. అంగారకుడి మధ్యరేఖ సమీపంలో ఉన్న జెజెరో అనే లోతైన బిలం సమీపంలో నాసా రోవర్ దిగినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఆరు చక్రాలతో కూడిన ఆ రోవర్ కనీసం రెండేళ్లపాటు అంగారకుడిపై ఉండి వివిధ పరిశోధనలు చేస్తుంది.
అక్కడ ఉన్న రాళ్లు, ఉపరితలాన్ని తొలిచి విశ్లేషణలు చేస్తుంది. తద్వారా అక్కడ జీవం ఏదైనా ఉందా అనే విషయంలో స్పష్టత రానుంది. జెజెరో ప్రాంతంలో బిలియన్ల సంవత్సరాల క్రితం సరోవరం వంటిది ఉండేదని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నిజం అక్కడ నీరు ఉండి ఉంటే.. జీవం కూడా ఉండే ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పర్సెవరెన్స్ పరిశోధనల్లో ఈ అంశంపై స్పష్టత రానుంది. కాగా, ఈ రోవర్ విజయవంతంగా ల్యాండ్ అయిందని.. దాని ముందు, వెనుక భాగాల్లో ఎలాంటి ఎత్తుపల్లాలు కూడా లేవని అది పంపిన చిత్రాల ద్వారా వెల్లడైంది.
239273 648358This really is the suitable blog for anybody who needs to seek out out about this subject. You notice so considerably its virtually laborious to argue with you (not that I actually would wantHaHa). You undoubtedly put a brand new spin on a topic thats been written about for years. Wonderful stuff, just great! 386751
768224 721865Dead composed topic matter, thanks for information . 923866