నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన హైకోర్టు న్యాయదవాద దంపతుల అంత్యక్రియలు గురువారం ముగిశాయి. పోస్టుమార్టం అనంతరం గురువారం మధ్యాహ్నం 2 గంటలకు వామన్ రావు, నాగమణి మృతదేహాలను స్వగ్రామం గుంజపడుగుకు తరలించారు. సాయంత్రం బంధుమిత్రుల సమక్షంలో గోదావరి ఒడ్డున అంత్యక్రియలు నిర్వహించారు. ఇరువురు మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు జరిపారు. వామన్ రావు సోదరుడు గట్టు ఇంద్రశేఖర్ చితికి నిప్పంటించారు. హైకోర్టు నుంచి పలువురు న్యాయవాదులు అక్కడకు వచ్చి తమ సహచరులకు ఘనంగా నివాళులు అర్పించారు. కాగా, ఈ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ఈ హత్యాకాండలో రాజకీయ జోక్యం ఉందనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుకు ఇందులో ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు. హత్యకు ఉపయోగించిన కారు, కత్తులను ఆయనే సమకూర్చినట్టు విచారణలో నిర్ధారించారు. బిట్టు శ్రీను వెనుక ఉండగా.. మంథని టీఆర్ఎస్ అధ్యక్షుడు కుంట శ్రీనివాస్, బిట్టు శ్రీను కారు డ్రైవర్ చిరంజీవి న్యాయవాదులను హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. అలాగే వామన్ రావు కదలికలను అక్కపాక కుమార్ ఎప్పటికప్పుడు తెలియజేసినట్టు తెలిపారు. ప్రస్తుతం కుంట శ్రీనివాస్, చిరంజీవి, కుమార్ లను పోలీసులు అరెస్టు చేయగా.. బిట్టు శ్రీను కోసం గాలిస్తున్నారు.
696177 492306Excellent post man, keep the nice function, just shared this with my friendz 612709