ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతితో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్బాబు సతీమణి నమ్రత భేటీ అవడం అటు రాజకీయ వర్గాల్లోనూ ఇటు సినీ వర్గాల్లోనూ ఆసక్తికరమైన చర్చకు కారణమయ్యింది. మహేష్బాబు, తన తండ్రి స్వగ్రామమైన బుర్రిపాలెంను దత్తత తీసుకుని, ఆ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం విదితమే. దానికి సంబంధించిన విషయాలపై చర్చించేందుకే వైఎస్ భారతితో నమ్రత సమావేశమయ్యారన్నది వీరిద్దరి భేటీ అనంతరం బయటకు వచ్చిన కథనాల సారాంశం.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులెవరూ ఆయన్ని కలవలేదంటూ వైసీపీ నేతలు వాపోతున్న విషయం విదితమే. ఇటీవలే చిరంజీవి, వైఎస్ జగన్ని కలిసి వచ్చారు. ఆ లెక్కన, మహేష్బాబు కూడా వైఎస్ జగన్ని కలిసి వుండాల్సిందన్నది వైసీపీ నేతల అభిప్రాయంగా కన్పిస్తోంది.
నిజానికి మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణకి సోదరుడైన ఘట్టమనేని ఆదిశేషగిరిరావు వైసీపీలో కొంత కాలం పనిచేశారు. ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నాక అనూహ్యంగా ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు.
ఆదిశేషగిరిరావు అప్పట్లో పార్టీ మారకుండా వుండి వుంటే, ఇప్పుడాయనకు వైసీపీ ప్రభుత్వంలో మంచి పదవి దక్కి వుండేదే. మరోపక్క మహేష్కి సొంత బావ అయిన గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీగా గుంటూరు నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహేష్, తన బావకి రాజకీయంగా ఇబ్బందులు రాకుండా వుండేలా వైఎస్ భారతి వద్దకు నమ్రతను పంపారా.? అన్న చర్చ జరుగుతోంది.
మరోపక్క, బుర్రిపాలెం అభివృద్ధి పనుల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్న నమ్రత, ఆ కోణంలోనే వైఎస్ భారతిని కలిశారు తప్ప, ఇందులో రాజకీయ పరమైన అంశాలేమీ లేవన్నది సూపర్ స్టార్ కాంపౌండ్ నుంచి వస్తోన్న సమాచారం.
799451 473791Obtaining the right Immigration Solicitor […]below youll uncover the link to some internet sites that we believe you ought to visit[…] 822268
463044 721790Perfect just what I was looking for! . 786453
631915 184402I see something genuinely interesting about your internet internet site so I saved to bookmarks . 222634
709771 723804hey I was really impressed with the setup you used with this blog. I use blogs my self so great job. definatly adding to bookmarks. 430830