అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుతం చైతూకి హిట్ చాలా అవసరం. అందుకే కార్తికేయ 2 వంటి భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు చందూ మొండేటితో తన నెక్స్ట్ సినిమాను ప్లాన్ చేసాడు చైతన్య. ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అతి త్వరలోనే షూటింగ్ కూడా మొదలుకానుంది.
సాయి పల్లవి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించనుంది. నాగ చైతన్య – సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ మంచి విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఇటీవలే దసరా చిత్రానికి పనిచేసిన సంతోష్ నారాయణన్ నాగ చైతన్య – చందూ చిత్రానికి కూడా వర్క్ చేయనున్నాడు. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. జాలర్ల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది.