చాన్నాళ్ళ క్రితం నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు.. అసలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏమయ్యింది.? తాజాగా జనసేన పార్టీలోకి వైసీపీ ఎమ్మెల్సీ వంశీ జంపింగ్.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ వంశీ. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారీయన. వైసీపీ నుంచి ఎవరొచ్చినా, జనసేనలోకి ఘన స్వాగతం.. అని గనుక జనసేనాని ప్రకటించేస్తే, ఇక వైసీపీలో ఎవరైనా మిగులుతారా.? అన్న చర్చ జరుగుతోంది. అతిశయోక్తి కావొచ్చుగానీ, రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే.
టీడీపీ – జనసేన మిత్రపక్షాలు గనుక.. రెండు పార్టీల మధ్యా ఈ విషయమై అవగాహన వుండాల్సిన అవసరం ఎంతైనా వుంది. అటు టీడీపీలోకీ, ఇటు జనసేనలోకీ వైసీపీ నుంచి వలసలు జోరందుకున్నాయి.
‘మా పార్టీ టిక్కెట్లు దక్కని నాయకులు, ఇతర పార్టీల్లోకి వెళ్ళడంలో వింతేముంది.? మేం ఏం చేసినా, వైనాట్ 175 కోసమే..’ అంటూ, అక్కడికేదో ‘మా నాయకులు వేరే వున్నారు..’ అన్నట్టుగా వైసీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి సెలవిస్తున్నారు. కానీ, సజ్జల రామకృష్ణారెడ్డే స్వయంగా వైసీపీకి శకునిలా తయారవుతున్నారేమోనన్న సందేహాలు వైసీపీలో వ్యక్తమవుతున్నాయి.
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల విషయానికొస్తే, వైసీపీలో ఎవరుంటారో ఎవరు ఊడతారో వైసీపీ అధినాయకత్వానికే అర్థం కావడంలేదు. సిట్టింగులు గెలిచే పరిస్థితి లేదు. కొత్తవారి సంగతేంటో తెలీదు. ఈ గందరగోళం నడుమ, సిట్టింగులేమో తమ దారి తాము చూసుకుంటున్నారు.
అక్కడా ఇక్కడా అని కాదు, రాయలసీమలోనూ పెద్దయెత్తున వలసలు జోరందుకుంటున్నాయి వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి. వైసీపీ ఎంతలా గింజుకుంటున్నా, ఎన్ని పుల్లలు పెట్టాలనుకుంటున్నా టీడీపీ – జనసేన పొత్తుకి ఏమాత్రం ఇబ్బంది కలగడంలేదు.
ఇదే వైసీపీకి చాలా పెద్ద మైనస్.! కెలక్కుండా వుంటే, కనీసం వైసీపీ శ్రేణుల్లో అయినా ‘మేం బలంగా వున్నాం’ అనే భావన వుంటుంది. కెలకడం ఎక్కువయ్యేకొద్దీ, వైసీపీలోని అభద్రతా భావం ఆ పార్టీ శ్రేణులకే అర్థమయిపోతుంది. అదే ఇప్పుడు వైసీపీకి శాపంగా మారుతోంది.
జనసేనాని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏం చేయబోతున్నారు.? వైసీపీ ఈ రెండు మూడు రోజుల్లోనే ఎంతలా కకావికలు కాబోతోంది.? జస్ట్ వెయిట్ అండ్ సీ.!
అన్నట్టు, ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ముగ్గురు వైసీపీ ఎంపీలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో టచ్లోకి వచ్చారట. ముహూర్తం చూసుకుని, జనసేన అధినేతతో ఆ వైసీపీ ఎంపీలు భేటీ అయ్యే అవకాశం వుంది. అదే గనుక జరిగితే, వైసీపీ ఖేల్ ఖతం అంతే.!