‘ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీ ఘటనకు యాజమాన్య నిర్లక్ష్యమే కారణం. స్టెరైన్ మిక్సింగ్ యూనిట్ పైపింగ్ లో మరమ్మత్తులు చేయాల్సి ఉన్నా యాజమాన్యం పట్టించుకోలేదు. అత్యవసర సైరన్లు 36 ఉన్నా ప్రమాద సమయంలో ఒక్కటీ మోగలేదు’ అని హైపవర్ కమిటీ చైర్మెన్ నీరబ్ కుమార్ తెలిపారు. సంచలనం రేపిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై సిఎం కు ఆయన నివేదిక సమర్పించారు. మొత్తం 4వేల పేజీలతో నివేదిక సిద్దం చేసి.. ఇందులో నుంచి 350 పేజీల రిపోర్ట్ ను సీఎంకు అందించారు.
‘స్టైరిన్ గ్యాస్ వున్న ఎం-6 ట్యాంక్ లో ఉష్ణోగ్రతలు పెరిగి గ్యాస్ లీక్ అయింది. సైరన్ మోగ లేదు. నియంత్రణ వ్యవస్ధలో ఉన్న పలు లోపాలను గుర్తించినా పట్టించుకోలేదు. ట్యాంక్ డిజైన్ లో లోపాలున్నాయి. కూలింగ్ సిస్టమ్ లేదు. సిబ్బందికి భద్రత విషయంలో అవగాహన లేదు. ప్రమాద సమయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో యాజమాన్యం పూర్తిగా విఫలమైంది.
ఈ దుర్ఘటనలో 12మంది మృతి చెందారు. 555 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందారు. ప్రజల నుంచి 1250 ప్రశ్నలు వచ్చాయి. 250 ఈమెయిల్ ,180ఫోన్ కాల్స్ స్వీకరించాం. వాటన్నిటి సమాదానం ఇచ్చాం’ అని ఆయన వివరించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు, సేఫ్టీ మెజర్ మెంట్స్, ఫ్యాక్టరీ సేఫ్టీ బోర్డు ఏర్నాటు గురించి సవిరంగా నివేదికలో పొందుపరిచామని కూడా తెలిపారు.
384315 17894Pretty section of content. I just stumbled upon your weblog and in accession capital to assert that I get truly enjoyed account your blog posts. Any way I will likely be subscribing to your augment and even I achievement you access consistently swiftly. 13315