కొద్ది రోజుల క్రితం శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ సోకిన ఓ వ్యక్తి చనిపోతే, అత్యంత అమానవీయంగా ఆ వ్యక్తిని జెసిబిలో ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అంత్యక్రియలు నిర్వహించారు. ఆ ఘటన అప్పట్లో పెను దుమారం రేపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వ్యవహారంపై చాలా సీరియస్ అయ్యారు. కానీ, ఏం లాభం.? మళ్ళీ అలాంటి ఘటనే ఇంకోసారి జరిగింది. ఈ సారి తిరుపతిలో జేసీబీ సాయంతో ఓ వ్యక్తి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. అంబులెన్స్లో తీసుకొచ్చినా, జేసీబీ తొట్టెలో మృతదేహాన్ని వుంచి, ఆ జేసీబీ ద్వారానే గుంతలో పడేశారు అమానవీయంగా. దీనికి సంబంధించి ఓ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది. మరోపక్క, ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పరీక్షల పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఓ వీడియో షేర్ చేశారు. అందులో, ఓ వ్యక్తి తన మొబైల్కి ‘కరోనా వైరస్’ పరీక్ష తాలూకు రిజల్ట్ని పంపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు కన్పిస్తోంది. అసలు ఆ వ్యక్తి కరోనా టెస్ట్ చేయించుకోలేదట. ఈ ట్వీట్పై స్పందించిన ‘ఆరోగ్యాంధ్ర’ ట్విటర్ హ్యాండిల్, ఆయా వ్యక్తులు తప్పుడు ఫోన్ నెంబర్లు ఇస్తే ఇలాంటి పొరపాట్లు జరుగుతాయని వివరణ ఇచ్చింది. అయితే, ఈ వివరణ పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పెద్దయెత్తున కరోనా పరీక్షలు జరుగుతున్న మాట వాస్తవం. అలాగని, ఇలాంటి విషయాల్ని లైట్ తీసుకుంటే ఎలా.? చిన్న పొరపాట్లే.. చాలా ఖరీదైన తప్పిదాలుగా మారిపోయే అవకాశం లేకపోలేదు. ఇదిలా వుంటే, ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తొలిసారి ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ ఫలితాలు ఒక్కరోజులో వెయ్యి మార్క్ దాటడం గమనార్హం.
మొత్తంగా 1322 కరోనా పాజిటివ్ కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదవడంతో ఒక్కసారిగా రాష్ట్ర ప్రజానీకంలో ఆందోళన నెలకొంది. పైగా, ఈ రోజు (నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు) తక్కువ శాంపిల్స్.. అంటే, 16,712 మాత్రమే సేకరించగా, 1322 పాజిటివ్ కేసులు వచ్చాయి. తెలంగాణతో పోల్చితే టెస్టుల సంఖ్య ఎక్కువ, పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువే అయినా.. అనూహ్యంగా పాజిటివ్ కేసులు పెరగడం, అదే సమయంలో టెస్టుల సంఖ్య తగ్గడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
From the beginning, the @ysjagan Govt has cheated people & the Centre reg Covid Testing numbers. This video from Anantapur Dist is proof of that.People who had not even given their samples have received SMSes declaring them to be negative/positive(1/2)#SMSCoronaTestingRacketInAP pic.twitter.com/KBvFTNcDEl
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 6, 2020
504500 911292I like this internet site because so much utile stuff on here : D. 232847