మనుషులకు ఆధార్ కార్డు ఉన్నట్టే భూములకు కూడా ఆధార్ గుర్తింపు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్రంలోని భూముల రీసర్వేకి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శ ఉషారాణి భూసర్వేకు సంబంధించిన జీవో విడుదల చేశారు. వ్యక్తుల ఆధార్ విశిష్ట సంఖ్య ఉన్నట్టే ఇకపై భూములకు కూడా నెంబర్ ఉండబోతోంది.
భూములకు భూదార్ నెంబర్ కేటాయించి అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పనులు కూడా అధికారులు మొదలుపెట్టారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని భూములను రీసర్వే చేయనున్నారు. ఇందుకు మండలంలోని 25 గ్రామాల పరిధిలోని 66,761 ఎకరాల భూమిని సర్వే చేయనున్నారు. ఇందుకు 200.15కోట్లు ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సర్వే సెటిల్ మెంట్ డైరక్టర్ కోరారు.
ఇందుకు సంబంధించిన పరికరాల కొనుగోలు, 11,158 రోవర్స్ కొనుగోలు కోసం కూడా పరిపాలనా అనుమతి పొందనున్నారు. భూముల రీసర్వేలో ఫేజ్-1, ఫేజ్2 కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల స్థాయి పెంచడం, నిర్వహణ ఖర్చుల కోసం నిధులు కూడా విడుదల చేయాలని కోరారు. వీటన్నింటికీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సాధ్యమైనంత తక్కువ ఖర్చులో ఎటువంటి లోపాలు లేకుండా రీసర్వే చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
552279 740825Enjoyed reading through this, really great stuff, thankyou . 853155
551212 309471I feel this internet site contains some quite excellent information for every person : D. 514987