దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు ను అత్యంత స్పీడ్ గా విచారణ చేపట్టినట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ కేసులో మొత్తం ఆరు మంది అరెస్ట్ అవ్వగా అందులో అయిదుగురు మైనర్ లే అవ్వడం మరింతగా చర్చనీయాంశం అయ్యింది. మేజర్ ఒక్కడికే కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.. మైనర్ లకు తక్కువ శిక్ష తో బయట పడే ఛాన్స్ ఉందంటూ న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈ సమయంలో మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రేప్ కేసులో ఉన్న మైనర్ లను కూడా మేజర్ లు గా భావించి మేజర్ లకు వేసే శిక్షలనే మైనర్ లకు కూడా అమలు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాడు. ఇలాంటి కేసుల్లో మైనర్ లు మేజర్ లు అని చూడకూడదు అంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేశాడు. దోషులుగా తేలిన ప్రతి ఒక్కరికి కూడా కఠిన శిక్ష పడాలంటూ తాను కోరుకుంటున్నాను అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
688174 589320Thank you, Ive just been searching for data about this subject for a whilst and yours will be the greatest Ive discovered till now. But, what in regards towards the conclusion? Are you certain concerning the supply? 940725