Switch to English

Harshavardhan: మనో నిబ్బరంతో… మరణాన్ని ఆహ్వానించాడు!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Harshavardhan: ‘అమ్మా..నాన్న నేను కొద్ది రోజుల్లో చనిపోతున్నా.. మీరు ధైర్యంగా ఉండండి’ అని చెప్పి తన మృతదేహం విదేశాల నుంచి సొంతూరుకు రావడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడో వైద్యుడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. కన్నీళ్లు తప్పించే ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే..

ఖమ్మం టౌన్ లోని శ్రీనివాస్ నగర్ కు చెందిన ఏపూరి రామారావు, ప్రమీల దంపతులకు ఇద్దరు కుమారులు. రామారావు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా. ప్రమీల ఓ ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయినిగా పనిచేసి రిటైర్డ్అయ్యారు. వీరి పెద్ద కుమారుడు హర్షవర్ధన్ ఆస్ట్రేలియాలో ఎంఎస్ పూర్తి చేసి అక్కడే వైద్యుడిగా పనిచేస్తున్నారు. స్వతహాగా ఫిట్నెస్ కి ప్రాధాన్యమిచ్చే హర్షవర్ధన్ 2020 అక్టోబర్ 20న జిమ్ చేస్తుండగా దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడ్డారు. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా ఆయనకు ప్రాణాంతక ఊపిరితిత్తుల క్యాన్సర్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పగా.. ఇండియాకు వచ్చేయమని సూచించారు. అయితే ఆస్ట్రేలియాలోని మంచి వైద్యం దొరుకుతుందని హర్షవర్ధన్ అక్కడే ఉండిపోయారు. గతేడాది అక్టోబర్ లో ఇండియాకు తిరిగి వచ్చిన హర్షవర్ధన్ ఓ 15 రోజులు అక్కడే ఉండి తిరిగి ఆస్ట్రేలియా కి వెళ్లారు. మళ్లీ వ్యాధి తిరగబెట్టగా ఈసారి నయమయ్యే పరిస్థితి లేదు.. చావు తప్పదని తెలుసుకున్న ఆ యువకుడు తన మృతదేహం ఇండియాకు పంపించడానికి తగిన ఏర్పాట్లు అన్ని ముందుగానే చేసేశారు. అక్కడి నిబంధనల ప్రకారం ఒక లాయర్ ని కూడా నియమించుకున్నారు.

భార్యకు విడాకులు ఇచ్చి…

హర్షవర్ధన్ కు 2020 ఫిబ్రవరిలో సమీప బంధువైన సింధుతో వివాహం జరిగింది. కొద్ది రోజులకే లాక్ డౌన్ విధించడంతో సింధు ఆస్ట్రేలియాకు వెళ్లలేకపోయింది. వీసా వచ్చాక తీసుకెళ్తానని చెప్పి ఆమెని ఇండియాలోనే వదిలిపెట్టి హర్షవర్ధన్ ఆస్ట్రేలియా వెళ్లారు. పెళ్లయిన ఏడు నెలలకే తనకు క్యాన్సర్ నిర్ధారణ అయింది. మరణం తప్పదని భావించిన హర్ష..ఇరు కుటుంబాలను ఒప్పించి తన భార్యకు విడాకులు ఇచ్చారు. భార్య భవిష్యత్తు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడేళ్లపాటు క్యాన్సర్ తో పోరాడిన హర్ష మార్చి 24న కన్నుమూశారు. తన మృతదేహాన్ని ఉంచేందుకు శవ పేటిక కూడా ముందుగానే కొనుగోలు చేయడం గమనార్హం. హర్ష మరణ వార్తతో ఇరు కుటుంబాల్లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం ఆయన మృతదేహం స్వస్థలానికి చేరుకుంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...