ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను తుపానుని సృష్టించింది బీజేపీ. మరీ ముఖ్యంగా ఈ తుపాను దెబ్బకి తెలుగుదేశం పార్టీ విలవిల్లాడిపోతోంది. విదేశాల్లో ఉన్న చంద్రబాబు తిరిగొచ్చాక, పార్టీని పునర్నిర్మిస్తారా.? ఆ సమర్ధత. ఆ ఓపిక.. చంద్రబాబుకు ఉందా.? లేదా.? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే, ప్రస్తుత రాజకీయాల ట్రెండ్ని పరిశీలిస్తున్న టీడీపీ ముఖ్య నేతలు తమ దారి తాము చూసుకోవడం తప్ప, వేరే మార్గం లేదనే నిర్ణయానికి వచ్చేశారు.
మరీ ముఖ్యంగా టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతలు బీజేపీకి దాదాపు సరెండర్ అయిపోయినట్లే. మరి కాపు సామాజిక వర్గపు నేతల పరిస్థితేంటీ.? అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారమ్ ప్రకారం, మెజార్టీ కాపు నేతలు జనసేన గురించిన ఆలోచన చేస్తున్నారట. అయితే, పవన్ కళ్యాణ్ ఎంత వరకూ గట్టిగా నిలబడతాడనే దానిపై వారికి కొన్ని అనుమానాలున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం, బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉంది. 2014లో టీడీపీ వైపు నిలబడిన కాపు సామాజిక వర్గం, తాజా ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, జనసేన.. ఇలా మూడు భాగాలుగా విడిపోయింది. టీడీపీ, వైసీపీలతో పోల్చితే, జనసేన వైపు చూసిన కాపు సామాజిక వర్గం చాలా తక్కువే అన్నది ఓ అంచనా.
జాతీయ పార్టీ బీజేపీలోకి వెళ్తే, స్థానికంగా, తమ ఉనికి ప్రశ్నార్ధకమవుతుందని భావిస్తున్న కాపు సామాజిక వర్గ నేతలు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే, అంతా ఒక్క తాటిపైకి వచ్చి, ఓ బలమైన రాజకీయ శక్తిగా మారాలనే ఆలోచన చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే కొందరు కాపు నేతలు మెగాస్టార్ చిరంజీవితో కూడా మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలపై తనకు ఖచ్చితమైన అవగాహన ఉందనీ, కులం పేరుతో రాజకీయాలు మాత్రం చేయబోననీ, ఖరాఖండిగా చెబుతున్నారట. వైసీపీలో రెడ్డి సామాజిక వర్గ పెత్తనం, టీడీపీలో కమ్మ సామాజిక వర్గ పెత్తనం నడుస్తున్నప్పుడు జనసేన మాత్రం ఎందుకు ఆ దిశగా అడుగులెయ్యకూడదు.. అనేది ఆ నేతల ప్రశ్న. మరి ఈ పరిస్థితుల్లో జనసేనాని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.? ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏర్పడ్డ ఈ వేక్యూమ్లు.. ఆయన ఎలా తనకు అనుకూలంగా మార్చుకుంటారు.? వేచి చూడాల్సిందే.
526631 689529Thankyou for all your efforts that you have put in this. really intriguing info . 104562
781421 486129Im having a small dilemma. Im unable to subscribe to your rss feed for some reason. Im employing google reader by the way. 153833